దేశంలో కరోనా వైరస్ రాకముందు ఇండస్ట్రిలో నటీనటులు ఎక్కువగా సినిమాలపైనే దృష్టి పెడుతూ ఉండేవారు. కానీ కరోనా రావడంతో షూటింగ్స్ వాయిదా పడటం, థియేటర్లు మూతపడటంతో నటులు ఇంటికి పరిచయమైయ్యారు. అలాంటి సమయంలోనే డిజిటల్ మీడియా ఎక్కువగా ప్రాధాన్యత పొందింది. ఇక సమంత నటించిన ద ఫ్యామిలీ మ్యాన్ వంటి ఆఫర్స్ వస్తే ఏ మాత్రం నో చెప్పకూడదని అనుకుంటున్నారు మరి. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వెబ్ సీరీస్ లు కూడా బిజినెస్ గట్టిగానే రాణిస్తుంది. దాంతో రెమ్యునరేషన్ కూడా రెగ్యులర్ సినిమా మార్కెట్ కు తగ్గట్లుగానే కనిపిస్తుంది.

ఇక ఇప్పటికే చాలా మంది నటులు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టి వారి సత్తాను నిరూపించుకుంటారు. అయితే త్వరలోనే హీరో నాగ చైతన్య కూడా OTT ప్రపంచంలో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వచ్చిన విషయం అందరికి తెలిసిన విదితమే. అంతేకాదు.. ప్రస్తుతం హీరో నాగ చైతన్య  తొలి OTT ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

ఈ ప్రాజెక్టుని ప్రముఖ నిర్మాత శరత్ మరార్ ప్రొడక్షన్ లోనే ఆ వెబ్ ఫిల్మ్ తెరకెక్కుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇక గత రెండేళ్ల నుంచి కూడా చైతన్య శరత్ మరార్ తో ఒక ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. కాగా.. కమిట్మెంట్ ఇవ్వడంతో చైతన్య కోసం మంచి కథలను సెట్ చేయాలని నిర్మాత చాలా కాలంగా సెర్చ్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఒక వెబ్ కంటెంట్ నచ్చడంతో చైతన్యకు చెప్పారంట.

అయితే కొత్తగా ఉంటుందని చైతన్య కూడా వెంటనే ఒప్పేసుకున్నట్లు తెలుస్తుంది. కానీ.. దర్శకుడు ఎవరనే విషయాన్ని ఎంతవరకు బయటికి రాలేదు. ఇక త్వరలోనే అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు.. మరోవైపు నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోలు కూడా ఓటీటీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: