'మా' ఎన్నికలు ప్రతిసారి కంటే ఈ సారి కొంచెం వాడి వేడిగానే జరుగుతున్నట్లు తెలుస్తుంది . మొదట కేవలం ప్రకాష్ రాజ్ మాత్రమే ఎన్నికల బరిలో ఉన్నట్లు ప్రకటించుకున్నాడు . ఆ తరువాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు , మంచు విష్ణు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో వీరిద్దరి మధ్య పోటీ గట్టిగానే ఉంటుంది . అని అనుకునే సమయంలో జీవిత రాజశేఖర్ కూడా పోటీలో ఉన్నట్లు ప్రకటించింది .


ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నా గాని ఎవరి మద్దతు దారులతో వారు 'టీవీ' ఛానల్ కు ఇంటర్వ్యూ లు ఇస్తూ , తమ ఎజెండాలను కూడా ప్రకటిస్తున్నారు . అయితే ఈమధ్య బాలకృష్ణ ని 'మా' ఎన్నికల గురించి అడగగా 'మా' బిల్డింగ్ ను ఎందుకు కట్టలేదని వచ్చిన డబ్బంతా ఏమై పోతుంది అంటూ ప్రశ్నించారు . ఈ సందర్భంగా ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్న మంచు విష్ణు 'మా' బిల్డింగ్ నిర్మిస్తే అందులో నేను కచ్చితంగా భాగస్వామిని అవుతానని బాలకృష్ణ తెలిపినట్టు మంచు విష్ణు తెలియజేశాడు. ఈ సందర్భంగానే మా ప్రెసిడెంట్ పదవి కి వారు , వీరి కంటే బాలకృష్ణ లాంటి వ్యక్తి అయితే సరైనవాడు అని అందరి లెక్కలు తేలుతాయి అని మంచు విష్ణు పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు .


మా ప్రెసిడెంట్ ఎన్నికల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మంచు విష్ణు , బాలయ్య గారు ప్రెసిడెంట్ కావాలని ఆకాంక్షించారు . ఇండస్ట్రీ జనాలు ఎవరిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన నాకు ఎలాంటి అభ్యంతరం లేదు . బాలకృష్ణ 'మా' ప్రెసిడెంట్ అవ్వాలని నాకు చాలా కోరికగా ఉంది . ఆయన అయితే చాలా బాగుంటుంది . బాలకృష్ణ మాత్రమే కాకుండా ఆ జనరేషన్లో ఎవరు ప్రెసిడెంట్ అయిన  బాగానే ఉంటుంది అని మంచు విష్ణు తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: