టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ముఖ్యంగా వెంకటేష్ నటించిన తీరుకు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా వెంకటేష్ నటించిన నటనను కొనియాడారు. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ మంచి మార్కులు కొట్టేయగా ముని కన్న నటించిన కార్తీక్ రత్నం సీనప్ప గా నటించిన గీత కృష్ణ అనే బాలనటుడు మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్ చేయనున్న దృశ్యం 2 సినిమా కూడా ఓ టీ టీ లో విడుదల కావడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాతలు హాట్ స్టార్ లో విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం2 సినిమా ను వెంకటేష్ ఇక్కడ రీమేక్ చేస్తుండగా దీని మొదటి భాగం కూడా వెంకటేష్ తెలుగులో రీమేక్ చేసి హిట్ కొట్టడం విశేషం.  లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ లో విడుదల చేయడానికి హాట్ స్టార్ భావిస్తున్నట్లు సమాచారం.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తొందర్లోనే వెలువడుతుందట. ఏకధాటిగా 45 రోజులు ఒకే షెడ్యూల్లో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయగా మలయాళంలో దర్శకత్వం వహించిన జీతు జోసెఫ్ తెలుగు దృశ్యంను కూడా డైరెక్ట్ చేశాడు. అందరూ ఇప్పుడు నా మేనియా లో ఉండగానే వెంకటేష్ మరో చిత్రాన్ని విడుదలకు సిద్ధంగా ఉంచడం ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ సినిమా తర్వాత వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో f3 అనే సినిమాను లైన్ లో ఉంచాడు. మల్టీస్టారర్ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై కూడా తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వరుణ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: