బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వచ్చిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. ఈ కార్యక్రమాన్ని ఇతర భాషల్లోనూ రూపొందించేందుకు గాను పలు టెలివిజన్ చానల్స్ ముందుకు రాగా, అక్కడా సక్సెస్ అవడంతో పాటు నేటికీ కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని తెలుగులో తొలుత టాలీవుడ్ కింగ్ నాగార్జున మా టీవీలో ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ పేరిట హోస్ట్ చేశారు. ఇక నాగార్జున తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొన్నాళ్లు దానిని హోస్ట్ చేశారు. తాజాగా జెమినీ టీవీ వారు దానిని మళ్లీ తీసుకురాబోతున్నారు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ పేరిట రూపొందిస్తున్న ఈ షోకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ సందర్భంలో ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ ప్రోగ్రాం విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నటుడు మంచు విష్ణు. ఆ ప్రోగ్రాం హోస్ట్ చేయాలని మొదట ఎవరిని సంప్రదించారంటే..

స్టార్ మీలో తెలుగు వర్షన్ ఆఫ్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రసారం కాక ముందు జెమిని వారు దాని హక్కులు తీసకున్నారని విష్ణు తెలిపాడు. వారు ఈ షోను తెలుగులో టెలికాస్ట్  చేసేందుకు గాను ఎనిమిదేళ్ల కిందట మోహన్ బాబును హోస్ట్‌గా తీసుకురావాలని ప్రయత్నించారని గుర్తుచేశాడు. అయితే, ఈ ప్రోగ్రాం పట్ల మోహన్ బాబు ఆసక్తి చూపలేదని, దాంతో జెమిని వారు ఆ ప్రాజెక్టును వదిలేశారని తెలిపాడు విష్ణు. దీంతో మోహన్ బాబు ఒకవేళ హోస్ట్‌గా ప్రోగ్రాం లాంచ్ అయి ఉంటే ఎలా ఉండేదనే చర్చ నడుస్తోంది. ముక్కు సూటిగా వ్యవహరించే డైలాగ్ కింగ్ మోహన్ బాబు షోలో పార్టిసిపెంట్స్‌ను ఎలా డీల్ చేశేవాడు? ప్రశ్నోత్తరాల సమయంలో ఎలా బ్యాలెన్స్ చేసేవాడని నెటిజనాలు చర్చించుకుంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో హీరో మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలతో ఈ మేరకు కొత్త చర్చ తెర మీదకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: