ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేశ్ ప్రజెంట్ ‘నారప్ప’ సినిమా సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన ఈ ఫిల్మ్ విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. తమిళ్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వచ్చిన ‘అసురన్’ చిత్రానికి రీమేక్ ఇది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ‘నారప్ప’ చిత్రంలో నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి ఇండస్ట్రీ ప్రముఖులు స్పందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం సినిమా యూనిట్‌ను అభినందించగా, ఈ చిత్రంలో తన తండ్రి పాత్ర అత్యద్భుతం అంటూ వెంకీమామ కూతురు అశ్రిత భావోద్వేగంతో తెలిపారు. ఫన్నీ క్యారెక్టర్స్ ప్లే చేసే వెంకీ మామ ఈ సారి తన నట విశ్వరూపాన్ని ‘నారప్ప’ చిత్రంలో చూపించారని అభిమానులు మెచ్చుకుంటున్నారు.

  ఈ సమయంలో తన నెక్స్ట్ ఫిల్మ్ ‘ఎఫ్ 3’ షూటింగ్‌లో జాయిన్ అవుతారని భావించారు. కానీ, వెంకీ తన కూతురు కోసం స్పెయిన్ వెళ్లే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం ‘ఎఫ్ 2’కు సీక్వెల్. ఈ సినిమాలోని కొన్ని షెడ్యూల్స్ కంప్లీట్ కాగా, యూరప్‌లో పలు సీన్లపై వెంకీపై చిత్రీకరించాల్సి ఉందని సమాచారం. కానీ, వెంకీ మామ స్పెయిన్ వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకోవడంతో అవి వాయిదా పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాలోని మిగతా సీన్ల చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.


ఏటా కొంత కాలం విదేశాలకు వెకేషన్‌కు వెళ్లే వెంకీ ఈ సారి వెళ్లలేదట. అందుకే ఇప్పుడు స్పెయిన్‌కు వెళ్లాలనుకుంటున్నారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. యూరప్‌లో కొంత కాలం పాటు స్పెడ్ చేసి ఆ తర్వాత బార్సిలోనా ఉంటున్న కూతురు ఆశ్రిత, అల్లుడు వినాయక్ రెడ్డి వద్దకు వెళ్లాలనుకుంటున్నారట. గతంలో ఆశ్రిత యూరప్ వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలు ఇన్ స్టా వేదికగా షేర్ చేయగా, అవి సోషల్ మీడియాలో ట్రెండయ్యాయి. ఈ సారి వెంకీ మామతో కలిసి వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తుందో? లేదో ? చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: