సినిమా ఇండస్ట్రీలో  హీరోల మధ్య ఫ్రెండ్షిప్ అనేది కామన్ . అదే కలిసి ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో నటించినట్లయితే వారి ఫ్రెండ్ షిప్ మరింత బలపడుతుంది దానికి ఉదాహరణ చెప్పుకోవాల్సింది కోలీవుడ్ స్టార్ హీరోలు అయినా విశాల్ , ఆర్య. మీరిద్దరూ మొదటి నుండి మంచి స్నేహితులు అయిన బాల దర్శకత్వంలో తెరకెక్కిన  'వాడు - వీడు' సినిమాతో మరింత క్లోజ్ ఫ్రెండ్స్ గా మారారు . ప్రస్తుతం కూడా  వీరిద్దరు కలిసి 'ఎనిమి'  అనే సినిమాలో నటిస్తున్నారు. తాజాగా శుక్రవారం నాడు ఆర్య , సయేషా దంపతులకు  ఆడపిల్ల జన్మించింది . 

ఈ విషయం పట్ల చాలా సంతోషంతో  తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా నేను మామయ్య ని అయ్యాను .  చాలా ఎమోషనల్ గా ఉంది . , ఆర్య సాయేషా ఎప్పుడూ ఇలాగే ఆనందాలతో ఉండాలి  , స్నేహితుడు ఆర్య తండ్రిగా కొత్త బాధ్యతలు తీసుకున్నాడని ఈ  సందర్భంగా విశాల్ తెలిపారు . ప్రస్తుతం ఎంతో ఎమోషనల్ గా ఉన్నాను . అందుకే బ్రేక్ చేస్తున్నాను అని వివరించాడు . అంతేకాకుండా అభిమానులు , స్నేహితులు , ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఆర్య , స‌యేషా దంపతులకు సోషల్ మీడియా ద్వారా అభినందనలు చెబుతున్నారు . 

ఆర్య, స‌యేషా లు ప్రేమించుకొని 2019లో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . ఇదిలా ఉంటే ఆర్య హీరోగా నటించిన 'సార్ప‌ట్ట ప‌రంప‌ర' గురువారం విడుదలై మంచి స్పందన తెచ్చుకోగా శుక్రవారం రోజు ఆర్య తండ్రి కావడం పట్ల చాలామంది ఇది ఈ హీరోకు ఒక మంచి సంవత్సరం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. 'సార్ప‌ట్ట ప‌రంప‌ర'  ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా . కరోనా ప్రభావం వల్ల ఈ సినిమాను థియేటర్లో కాకుండా నేరుగా ప్రముఖ ' ఓ టి టి' లో విడుదల చేశారు .

మరింత సమాచారం తెలుసుకోండి: