టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు - మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ ప్రేమాయణం చాలా సీక్రెట్ గా జరిగింది. బి.గోపాల్ దర్శకత్వంలో 2000 సంవత్సరంలో వచ్చిన వంశీ సినిమాలో మహేష్ పక్కన హీరోయిన్ గా న‌మ్ర‌త‌ నటించారు. ప‌ద్మాల‌యా బ్యాన‌ర్‌లో ఆ సినిమా స్టార్ట్ అయింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ - న‌మ్ర‌త మ‌ధ్య‌ ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి వారిద్దరూ పెళ్లి చేసుకునే వరకు వెళ్ళింది. అసలు మహేష్ - నమ్రత మధ్య ప్రేమ ఎలా ? పుట్టింది ఎక్కడ ? చిగురించింది అన్నది ఆసక్తికరమే. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా కొన్ని పాటలు , సన్నివేశాల చిత్రీకరణ కోసం దర్శకుడు బి.గోపాల్ ఆస్ట్రేలియాలో 40 రోజుల పాటు సుదీర్ఘమైన షెడ్యూల్ చేశారు.

ఆ సమయంలో వారిద్దరూ ఎంతో సన్నిహితులు అయ్యారు. ఇండియాకు తిరిగి వచ్చాక కూడా కొద్ది రోజుల పాటు స్నేహితులుగా ఉన్న మహేష్ - నమ్రత తరచూ ఫోన్లు చేసుకునేవారు. చివరకు మహేష్, న‌మ్ర‌త‌ను విడిచి ఉండలేని స్థితికి వచ్చేశాడు. చాలాసార్లు సీక్రెట్ గా ముంబై వెళ్లి న‌మ్ర‌త‌ను కలిసి వచ్చేవాడిని అప్పట్లో ప్రముఖ సినీ మ్యాగ‌జైన్‌లో గాసిప్పులు వచ్చాయి. ఇప్పుడు ఉన్నంత సోషల్ మీడియా ప్రభావం అప్పుడు లేకపోవడంతో అది నిజమా కాదా ? అని చాలామంది నిర్ధారణకు రాయలేకపోయారు.

ఇలా 2005 వరకు ఐదు సంవత్సరాల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2005లో ముంబైలో పెళ్లి చేసుకున్నారు. ఇంత‌కు న‌మ్ర‌త‌ ఎవరో ? కాదు తెలుగులో మోహన్ బాబు హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మ సినిమా లో నటించిన శిల్పా శిరోద్కర్ కు స్వయంగా సోదరి. మహేష్ - నమ్రత దంపతులకు కుమారుడు గౌతం తోపాటు , కుమార్తె సితార ఉన్నారు. న‌మ్ర‌త వయసులో తన కంటే పెద్దది అయినా మహేష్ ఫ్యామిలీ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: