టాలీవుడ్ లో హీరోయిన్ రెజీనా కసాండ్రా కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించే ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుని. టాలీవుడ్ లో ఎస్ఎంఎస్ సినిమాతో పరిచయమైన ఈమె ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, పవర్, పిల్ల నువ్వు లేని జీవితం వంటి సినిమాలతో హిట్ అందుకొని హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. తమిళ చిత్రంతో ఆమె సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి ఆ తర్వాత కన్నడ హిందీ భాషలలో సైతం ప్రేక్షకులను మెప్పించింది.

 ఆమె జోఅచ్యుతానంద సినిమాలో నటించిన నటనకు గాను ఉత్తమ నటి అవార్డును అందుకుంది. తొలి సినిమాలో ఉత్తమ డెబ్యూ నటి అవార్డు కూడా అందుకుంది రెజీనా. క్రమ క్రమంగా ఆమె సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో వేరే భాషలో నటించడానికి వెళ్లి పోయింది. ప్రస్తుతం ఆమె ఆచార్య సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తోంది. అంతే కాకుండా మరో రెండు సినిమాల్లో నటిస్తోంది వెబ్ సెరీస్ లలో కూడా ఆమె నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇక అప్పట్లో ఆమెకు సాయి ధరమ్ తేజ్ తో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు రాగా ఇద్దరూ దాన్ని కొట్టిపడేశారు. వరుసగా రెండు మూడు సినిమాల్లో కలిసి నటించే సరికి వీరు ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారని అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. కానీ ఒకానొక సమయంలో దీని కొట్టిపారేసింది రెజీనా.. అంతా సద్దుమణిగింది అనే అనుకున్నారు కానీ తాజాగా ఈమె మెగా కోడలిగా వెళ్లబోతుంది అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని టాలీవుడ్ మొత్తం కోడై కూస్తుంది.  ఈ విషయంపై ఇంతవరకు ఎవరు స్పందించకపోవడంతో ఇదే నిజమని అనుకుంటున్నారు. మరి ఈ పుకార్లను ఆపడానికి ఎవరైనా ముందుకు వస్తారా అనేది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: