టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కార్లను ఎక్కువగా ఇష్టపడే అగ్ర హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఇప్పటికే తారక్ దగ్గర కొన్ని కార్ల కలెక్షన్స్ ఉన్నాయి.ఇప్పుడు తాజాగా ఆయన కలెక్షన్ లో మరో సరికొత్త లగ్జరీ కారు వచ్చి చేరింది.ఎన్టీఆర్ అత్యంత ఖరీదైన 'లాంబోర్గిని ఉరుస్' మోడల్ కారుని కొనేసాడు. దాదాపు ఈ కారు ఖరీదు ఐదు కోట్ల రూపాయలు.అత్యంత విలాసవంతమైన ఈ కారు ఎడారిలో కూడా రై రై మంటూ ఉరుకుతుంది.దీన్ని ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్నాడు ఎన్టీఆర్.అయితే తాజాగా ఈ కారు హైదరాబాద్ చేరుకోగానే మొదటి రైడ్ ను రామ్ చరణ్ ఇంటికి తీసుకెళ్లాడట ఎన్టీఆర్.

తాజాగా చరణ్ ఇంటి ముందు ఈ కారు పార్క్ చేసి ఉండగా సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి.ఇక ఇదిలా ఉంటె మొన్నామధ్య మన రెబల్ స్టార్ ప్రభాస్ కూడా లాంబోర్గిని కారును కొన్నాడు.అయితే దాని ధర రూ.4 కోట్లు ఉండగా.. ఇప్పుడు ఎన్టీఆర్ దాన్ని దాటేశాడు.దీంతో మన తెలుగు హీరోల్లో అత్యంత కాస్ట్లీ కారు ఉన్న వారిలో ఎన్టీఆర్ అందరికంటే ముందున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అయితే ఎన్టీఆర్ కాస్ట్ లీ కారు గురించి ఇప్పుడు ఇండ్రస్టీ లోనూ చర్చ జరుగుతోంది.

 అయితే తాజాగా ఈ వార్తలపై ఎన్టీఆర్ మేనేజర్ మహేష్ కోనేరు క్లారిటీ ఇచ్చాడు."సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు రామ్ చరణ్ ఇంటి ముందు ఉన్న ఆ కార్ ఎన్టీఆర్ ది కాదు.ఇందులో ఏమాత్రం నిజం లేదు.అయితే ఎన్టీఆర్ కొన్నాళ్ల క్రితం లాంబోర్గిని ఉరుస్ మోడల్ కారును కొనుగోలు చేసిన మాట వాస్తవమేనని.. కానీ ఆ కారు ఇంకా హైదరాబాద్ కి చేరుకోలేదని..అదు ఇంకా ఇటలీ నుంచి ఇండియాకి రావడానికి మరి కొంత సమయం పడుతుందని..త్వరలోనే ఆ కారు రానుందంటూ" ఆయన తెలిపారు.దీంతో నిన్నటి నుంచి ఎన్టీఆర్ కొత్త కారు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: