దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో ఓ భారీ ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఆ ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే దర్శకుడు శంకర్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. దీంతో ఆ ఎఫెక్ట్ అనేది రామ్ చరణ్ ప్రాజెక్ట్ పై పడింది. అయితే రామ్ చరణ్ మాత్రం శంకర్ తో సినిమ సెట్ చేయడానికి చాలానే కష్టపడ్డాడు.శంకర్ చిక్కుకున్న వివాదం నుంచి బయటికి తేవడానికి చరణ్ తన పలుకుబడిని సైతం ఉపయోగించాడు.చివరకి శంకర్ ని సమస్యల నుండి తప్పించి శంకర్ తో తన సినిమాకి లైన్ క్లియర్ చేసుకున్నాడు చరణ్.

అంతేకాదు ఎలాగైనా వచ్చే నెల సినిమాని మొదలుపెట్టాలని డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు.కానీ ఇంతలోనే చరణ్, శంకర్ సినిమా షూటింగ్ ని ఎలాగైనా ఆపాలని తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పక్కా ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.నిజానికి ఈ విషయంలో లైకా సంస్థ కోర్టులో ఓడిపోయింది.కాబట్టి ఎలాగూ పై కోర్టుకు వెళ్తుంది.ఈ లోపు వీరి ప్రాజెక్ట్ కి నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు పై ఒత్తిడి పెంచుతూ.. ఈ ప్రాజెక్ట్ చేస్తే మీకే ప్రాబ్లమ్స్ వస్తాయి అంటూ ఇన్ డైరెక్ట్ గా బెదిరిస్తోందట.అంతేకాదు దిల్ రాజుకి లైకా సంస్థ మొదటి నుండీ కూడా ఎమోషనల్ ప్రెజర్ చేస్తూ..తమ 170 కోట్లు ఆగిపోయాయని, ఒక నిర్మాతగా తమ బాధను అర్ధం చేసుకోవాలని దిల్ రాజును కోరిందట.

కానీ దిల్ రాజు ఇప్పటికే సినిమా చేస్తున్నట్లు కమిట్ అయిపోయాడు.కాబట్టి ఈ సమయంలో తాను వెనక్కి వెళ్లలేనంటూ దిల్ రాజు సదరు నిర్మాణ సంస్థకి క్లారిటీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మా పరిస్థితి మీకూ వస్తుంది జాగ్రత్త అంటూ లైకా సంస్థ దిల్ రాజుకి సూచించింది.మరి ఈ విషయంలో దిల్ రాజు ఏం చేస్తాడనేదే ఇప్పుడు ఇండ్రస్టీ లో చర్చనీయాంశంగా  మారింది.ఇక వచ్చే నెల నుండి శంకర్ - రామ్ చరణ్ ల ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టనుంది.పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: