సూపర్ స్టార్ మహేష్ దర్శకధీరుడు రాజమౌళి ఇద్దరి కాంబినేషన్ లో ఓ భారీ మూవీ రానున్న విషయం తెలిసిందే. కె.ఎల్ నారాయణన్ నిర్మిస్తున్న ఈ సినిమా కథ గురించి మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు లీక్ అయ్యింది. సినిమా కథ ఆల్రెడీ ఓకే అయ్యిందట. కాని బయట వినిపిస్తున్న కథల్లో ఏది కాదని టాక్. విజయేంద్ర ప్రసాద్ ఈ కథను చాలా అద్భుతంగా రాశారట. మహేష్ కు ఫైనల్ వర్షన్ వినిపించి సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో విలన్ గా కూడా స్టార్ హీరోనే తీసుకోవాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. మహేష్ కు ధీటుగా మరో స్టార్ హీరో అయితేనే విలన్ గా పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారట. బాహుబలి సినిమాలో ప్రభాస్ కు విలన్ గా రానాని దించినట్టుగా మహేష్ కోసం అలాంటి విలన్ కోసం వెతుకుతున్నారట. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ ఎండింగ్ పార్ట్ షూట్ చేస్తున్న రాజమౌళిసినిమా షూటింగ్ పూర్తి కాగానే మహేష్ సినిమాపై దృష్టి పెడతారని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తర్వాత ఏమాత్రం లేట్ చేయకుండా మహేష్ తో మూవీ సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు.

మహేష్, రాజమౌళి ఈ ఇద్దరు కలిసి చేసే సినిమా తప్పకుండా అంచనాలను మించి ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ ను ఇదివరకు ఏ డైరక్టర్ చూపించని విధంగా చూపించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రం తో మూవీ ప్లాన్ చేశాడు మహేష్ ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమా ఉంటుందని తెలుస్తుంది. త్రివిక్రం తో మహేష్ చేసే సినిమాను కూడా కేవలం మూడంటే మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసేలా షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నారట మహేష్.




మరింత సమాచారం తెలుసుకోండి: