ప్రస్తుతం టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ మంచి ఊపుమీద ఉన్నాడు. 2017 లో వచ్చిన 'రాజా ది గ్రేట్' తరువాత వరుసగా మూడు సినిమాలు పరాజయం పాలవ్వడంతో రవితేజ కెరీర్ ప్రమాదంలో పడింది. కానీ అంతలోనే మళ్ళీ గోపిచంద్ మలినేని 'క్రాక్' లాంటి సినిమా తీసి మరిచిపోలేని హిట్ ఇచ్చాడు. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో వెంటనే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒకటి రమేష్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'ఖిలాడీ'. ఈ సినిమా షూటింగ్ రెండవ షెడ్యూల్ ఈ నెల 26 నుండి మొదలవనుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా 'రామారావు - ఆన్ డ్యూటీ' ను కూడా ఈ మధ్యనే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను శరత్ మండవ అనే కొత్త దర్శకుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నాడు.
ఇందులో రవితేజ ఒక ప్రభుత్వ అధికారి పాత్రలో అలరించనున్నాడు. ఈ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. ఇందులో రవితేజకు జోడీగా దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక గాసిప్ తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుండడంతో రవితేజకు ధీటైన విలన్ ను రంగంలోకి దింపడానికి ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్. ఇది ఒక ప్రభుత్వ అధికారి నేపథ్యంలో ఉన్న కథ కాబట్టి ఒక క్లాస్ విలన్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.  క్లాస్ విలన్ గా మెప్పించడంలో ఆరితేరిన అరవింద్ స్వామిని ఈ పాత్ర కోసం అడిగినట్లు సమాచారం. ఇప్పటికే తెలుగులో 'ధ్రువ' సినిమాలో రామ్ చరణ్ కు విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పును పొందారు. దీనితో టాలీవుడ్ లోనూ అరవింద్ స్వామికి మంచి క్రేజ్ ఏర్పడింది.

 
ఈ క్రేజ్ ను వాడుకోవడానికి డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడట. ఇందుకు అరవింద్ స్వామి కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. కానీ ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే అటు అరవింద్ స్వామి కానీ, ఇటు చిత్ర బృందం కానీ నోరు మెదిపితేనే అందరికీ తెలుస్తుంది. లేదంటే ఇది ఒక ఆసక్తికరమైన గాసిప్ గానే మిగిలిపోతుంది. మరి చూద్దాం త్వరలోనే ఈ వార్త నిజమవుతుందా లేదా ? వీరిద్దరి మధ్య పోరు మాములుగా ఉండదు. అరవింద్ స్వామి తో కొట్లాటకు రవితేజ సిద్ధమా కాదా మరి కొద్ది రోజుల్లో తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: