మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఇలా నిలవడం అంటే మామూలు విషయం కాదు. ఇక నమ్రత, సుస్మిత సేన్, ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, లారా దత్తా ఇలా ప్రతి హీరోయిన్ కూడా ఈ పోటీలల్లో నిలిచి సినిమాల్లో నటించి మంచి సక్సెస్ ని రుచి చూశారు. అలాగే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఐశ్వర్య రాయ్, ప్రియాంక చొప్రాలు అయితే ఇప్పటికి సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్నారు. కాని వీరిలాగే 2017 వ సంవత్సరంలో మిస్ వరల్డ్ గా నిలిచిన మానుషి చిల్లర్ మాత్రం అసలు కనిపించకుండా పోయింది. మంచి ఫిజిక్, హైట్ ఇలా హీరోయిన్ కి ఏమాత్రం కూడా తీసిపోని ఈ ముద్దుగుమ్మకి మిస్ వరల్డ్ అయ్యి 4 సంవత్సరాలు అవుతున్న కాని ఒక్క సినిమాలో కూడా హీరోయిన్ గా నటించే అవకాశం రాలేదు.

ఇక అందాల అరబోతకు కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా తన హాట్ నెస్ తో సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తున్న కాని వాటిని చూసి ఎంజాయ్ చేసే వారే తప్ప ఎవ్వరు ఏ డైరెక్టర్ ఈమెకి అసలు హీరోయిన్ గా చేసే అవకాశమే ఇవ్వట్లేదు.ఈమె ఎంత దురదృష్టవంతురాలంటే రాక రాక వచ్చిన ఒక్కగానోక్క అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. యష్ రాజ్ సంస్థ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ని హీరోగా పెట్టి భారతదేశ రారాజు పృథ్వి రాజ్ బయోపిక్ తీస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మానుషి రాణి సంయుక్తగా నటిస్తుంది. కాని కరోనా కారణంగా ఈ సినిమా ఆలస్యమావుతూ వస్తుంది. ఇక ఈ సినిమాని ఇప్పుడు తెరకెక్కిస్తారో లేదో అని కూడా డౌట్ గా వుంది. ఇక దీంతో ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్న మానుషి ఏ సినిమాల్లో అవకాశాలు రాక చాలా బాధ పడుతుందట.ఇక తన అందాల ఆరబోతనైన చూసి అవకాశాలు ఇస్తారో ఇవ్వరో అని ఎదురు చూస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: