తెలుగు సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ సీనియర్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఒకానొక సమయంలో చిరంజీవి, వెంకటేష్ ఫామ్‌లో ఉన్న‌ప్పుడు వారి పక్కన హీరోయిన్ గా నటించే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేసే వాళ్ళు. అయితే ఇప్పుడు వెంకటేష్, చిరంజీవి సీనియర్లు అయిపోవడంతో వారి పక్కన నటించేందుకు హీరోయిన్లు సెట్ కావడం లేదు. ఈ పరిస్థితి వెంకటేష్, చిరంజీవికి మాత్రమే కాదు.. అందరు సీనియర్ హీరోలకు ఇదే ప‌రిస్థితి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీనియర్ హీరోల ప్రక్కన హీరోయిన్లను సెట్ చేసేందుకు దర్శక, నిర్మాతలు నానాపాట్లు పడుతున్నారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం వెంకటేష్, చిరంజీవి పక్కన నటించేందుకు ఓకే చెప్పి వారిద్దరికీ చుక్కలు చూపించిన విషయం ఇండస్ట్రీ వర్గాలకు తెలిసిందే.

హీరోయిన్ విష‌యం అప్ప‌ట్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు నయనతార. వెంకటేష్ బాబు బంగారం సినిమా లో నటించిన నయనతార చిరంజీవి సైరా నరసింహారెడ్డి లోకూడా  నటించింది. ఈ రెండు సినిమాలకు ఓకే చెప్పినప్పుడు ఆమె ఎన్నో కండిషన్లు పెట్టిందట. హీరో తనను టచ్ చేయకూడదు... తాను సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు రానని చెప్పిన న‌య‌న్ ఆ త‌ర్వాత షూటింగులకు కూడా ఆలస్యంగా వచ్చేదట.

ఆమె వల్లే బాబు బంగారం షూటింగ్ చాలా లేట్ అవడం తో పాటు... సరైన అవుట్పుట్ రాలేదని దర్శకుడు మారుతి సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు టాక్. కేవ‌లం న‌య‌న్ షెడ్యూల్స్ లేట్ అవ్వ‌డం వ‌ల్లే బాబు బంగారం షూటింగ్ చాలా ఆల‌స్య మైంది. ఇక సైరా నరసింహారెడ్డి లో నటించిన నయనతారసినిమా యూనిట్ తో పాటు దర్శకుడు సురేందర్రెడ్డిని ఇబ్బందులు పెట్టిందట. న‌య‌న్‌ తీరుపై చిరు సైతం అసహనం వ్యక్తం చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు కూడా ఆమె తెలుగు సినిమాల విష‌యంలో చాలా ఇబ్బందులు పెడుతుంద‌న్న ప్ర‌చారం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: