రిపీట్ అవబోతున్న మరో సూపర్ కాంబో. ఈ మధ్య కాలంలో మల్టీ స్టారర్ చిత్రాలు వరుసగా తెరకెక్కుతూ ప్రేక్షకుల్ని తెగ అలరిస్తున్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు కలసి ఒకే చిత్రంలో నటించబోతున్నారు అంటే అభిమానుల సంతోషం డబుల్ అయినట్టే. ఇద్దరు హీరోలను అభిమానించే ప్రేక్షకులు ఆ సినిమా అకౌంట్ లో పడిపోయినట్లే. ఇంతకీ ఇప్పుడు రాబోతున్న ఆ మల్టీ స్టారర్ చిత్రం ఏమిటో చూద్దాం. అక్కినేని నాగార్జున, ఆయన చిన్న కుమారుడు అఖిల్ అని చెబుతున్నారు. వీరిద్దరూ పేరున్న సెలబ్రిటీలు మాత్రమీ కాదు. అబ్బా కొడుకులు కూడా కావడంతో ఆ సినిమాకి మరింత హైప్ పెరిగే అవకాశం ఉంది. ఇక మనం సినిమాలో అఖిల్ ఒకటి రెండు సీన్లలోనే కనిపించగా, ఇప్పుడు పూర్తి స్థాయిలో నటించనున్నాడు.

ప్రస్తుతం అఖిల్ సినీ కెరీర్ కూడా అంత ఆశాజనకంగా లేకపోవడంతో ప్రయోగాలు చేసే పనిలో పడ్డారు. ఇక కొడుకు కెరీర్ ను చక్కదిద్దే బాధ్యతను తండ్రి తన భుజాలపై వేసుకున్నాడు.  ఈ సినిమాతో ఓ నూతన దర్శకుడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నట్లు సమాచారం. కథ ఇప్పటికే సిద్ధమైనా, ఇంకా తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట. నాగార్జున సొంత నిర్మాణం లోనే ఈ సినిమాను నిర్మించనున్నారని టాక్.

కాగా ప్రస్తుతం అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' మరియు 'ఏజెంట్' చిత్రాలతో బిజీగా ఉన్నారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' విడుదలకు సిద్ధంగా ఉండగా, ఏజెంట్ ఇంకా షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు కాకా మరో రెండు సినిమాలు కూడా అఖిల్ లైన్ లో పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. అందులో నాగార్జున తో చేస్తున్న ఒకటి కావొచ్చని గుసగుసలు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ, వార్త మాత్రం అక్కినేని అభిమానులను ఎంతగానో అట్రాక్ట్ చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: