ప్రస్తుతం యమ స్పీడ్ గా దూసుకుపోతున్న సినిమా అనుబంధ రంగాలలో  'ఓటిటి' ఒకటి. 'ఓటిటి' లు ప్రారంభించిన మొదటి దశలో చిన్న చిన్న నటీనటులతో తక్కువ బడ్జెట్ తో  ఈ సంస్థలు సినిమాలను నిర్మించుకునే వారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లతో 'ఓటిటి' సంస్థలు కాంబినేషన్ సెట్ చేస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఈ సంస్థల మధ్య పోటీ కావచ్చు లేక కరోనా వల్ల థియేటర్లు మూత పడటంతో సినీ జనానికి మంచి కంటెంట్ ని అందించి తమ సంస్థ ముందు ఉండడానికి కూడా కావచ్చు. ఇలాంటి వార్త ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. తెలుగు ప్రముఖ హీరోలలో ఒకరైన అక్కినేని నాగ చైతన్య 'ఓటిటి' కి ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు ప్రముఖ నిర్మాతలలో ఒకరైన శరత్ మరార్  సిద్ధం చేయించిన కథతో అక్కినేని నాగ చైతన్య డిజిటల్ ఎంట్రీ ఉంటుందని వార్త వినిపిస్తోంది.


కానీ ఈ సినిమా  ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా, బంగార్రాజు' సినిమాల తర్వాత ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. 'లాల్ సింగ్ చద్దా' సినిమా తో ఈ యంగ్ హీరో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం నాగ చైతన్య చాలా కష్ట పడినట్లు మరియు కొన్ని రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటే 'బంగార్రాజు' సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా  'సోగ్గాడే చిన్ని నాయనా' కు సీక్వెల్ గా రానుంది. ప్రస్తుతం నాగార్జున కూడా ప్రవీణ్ సత్తార్ సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: