దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా రేంజ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్' ఇందులో రామ్ చరణ్ ,ఎన్టీఆర్ లు కథానాయకులుగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీచర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈమధ్య ఈ సినిమా బృందం ఒక మేకింగ్ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ మేకింగ్ వీడియోలో ఇప్పటి వరకు విడుదల చేయని సముద్రఖని ,శ్రేయ లాంటి కొందరు నటీనటుల లుక్ లను కూడా రివిల్ చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్రకు జోడీగా ఆలియా భట్  సీత పాత్రలో కనిపించనుంది. వీరిద్దరికి సంబంధించిన టీజర్లను చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేయగా వీటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమాలో తనకు సంబంధించిన కొంత వర్క్ మిగిలి ఉండడంతో పోయిన వారమే ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ కు వచ్చినట్లు తన వర్క్ ని కంప్లీట్ చేసుకొని ముంబైకి తిరిగి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.


ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించనున్నాడు. అందుకు సంబంధించిన ఒక టీజర్ ను కూడా చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేసింది. ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటించనుంది. ఈ సినిమాపై సినీ జనాలకు అంచనాలను రెట్టింపు చేసేందుకు ఒక ప్రమోషనల్ సాంగ్ ను తీసే ఉద్దేశంలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అక్టోబర్ 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని మరొక సారి ప్రపంచ వ్యాప్తంగా మారుమోగేలా చేస్తాడు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: