భార‌త దేశ సినిమా చ‌రిత్రలో ఎవ‌ర్ గ్రీన్ సినిమాలు తీసిన ద‌ర్శ‌కుడు ఆయ‌న.. సినిమా రంగంలోకి అడుగు పెట్టి దాదాపుగా 20 ఏళ్లు అవుతున్నా ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు తీసింది కేవ‌లం 5 సినిమాలు మాత్ర‌మే.. అయిన‌ప్ప‌టికి గొప్ప ద‌ర్శ‌కుడిగా పేరు ద‌క్కించుకున్నారు రాజ్ కుమార్ హిరానీ. ఆయ‌న సినిమాలో సందేశంతో పాటు వినోదం కూడా క‌ల‌గ‌లిపి ఉండ‌డం విశేషం ఇలాంటి చిత్రాల‌ను కొద్ది మంది మాత్ర‌మే తీయ‌గ‌ల‌రు.

రాజ్ కుమార్ హిరానీ సందేశాత్మక సినిమాలు తీయ‌డంలో  దేశంలోనే ముందు వ‌రుస‌లో ఉంటాడు. కాబ‌ట్టే ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో సినిమా వ‌స్తుంది అంటే చాలు ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ఇండ‌స్ట్రీ  వర్గాల వారు కూడా ఎంతో ఆతృతతో పాటు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయ‌న చివ‌రిసారిగా హిందీలో సంజు సినిమాను తెర‌కెక్కించారు. సినిమా సినిమాకు మ‌ధ్య ఏళ్ల‌కు ఏళ్ల  గ్యాప్ తీసుకుంటాడు రాజ్‌కుమార్ హిరానీ త‌న తదుపరి సినిమాను బాలీవుడ్ బాద్ షా సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో చేయబోతున్నట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. చివ‌రిగా జీరో సినిమాను చేసిన‌ షారుఖ్ ఖాన్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. గ‌త 10 సంవ‌త్స‌రాల్లో సినిమాల ప‌రంగా షారుఖ్ ఖాన్ స‌రైన స‌క్సెస్‌ను సాధించ‌లేక‌పోయాడు.

   బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ప్ర‌స్తుతం ప‌ఠాన్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన త‌రువాత మ‌రో సినిమాను అట్లీ కుమార్ ద‌ర్వ‌క‌త్వంలో చేయ‌బోతున్నాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇదే క్ర‌మంలో రాజ్ కుమార్ హిరానీ ద‌ర్వ‌క‌త్వంలో షారుఖ్ కూడా ఓ సినిమాను చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. వీరి కాంబోలో రాబోయే సినిమాపై భారీ ఎత్తున అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా కోసం సినిమా అభిమానులు సుదీర్ఘ కాలంగా చూస్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమా ఎలా ఉంటుంది ఎప్పుడు మొద‌ల‌వుతుంది అనే విషయాన్ని త్వరలోనే యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయ‌ని బీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది.

  అయితే ఇతండియాస్ బెస్ట్ డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ హిరానీ సినిమా పైగా షారుఖ్ ఖాన్ మూవీ అవ్వడం వల్ల ఈ సినిమాపై మరింతగా అంచనాలు ఉంటాయి. ఈ మద్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాలు  వస్తున్నాయి. మ‌రి వీరి కాంబినేష‌న్‌లో ఎంత బ‌డ్జెట్‌లో సినిమా వ‌స్తుందో చూడాలి. ప‌ఠాన్ సినిమా త‌రువాత అట్లీ చిత్రాన్ని రూపొందించిన త‌ద‌నంత‌రం ఈ సూప‌ర్ కాంబోలో సినిమా తెర‌పైకి రానుందా అనే విష‌యంపై ఇంకొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: