తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న యంగ్ హీరోలలో తేజ సజ్జ ఒకరు. ఈ నటుడు చిన్నప్పటి నుండే చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సమంత మెయిన్ హీరోయిన్ గా నటించిన 'ఓ బేబీ' సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ లో నటించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు తేజ సజ్జ కు కూడా మంచి గుర్తింపును తీసుకు వచ్చింది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా 'జాంబి రెడ్డి' అనే సినిమాలో నటించాడు. ఇది ఇండియాలోనే మొదటిసారి జాంబీస్ జోనర్ లో కామెడీని మిక్స్ చేస్తూ వచ్చిన సినిమా. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఈ హీరో క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం తేజ హీరోగా నటించిన  'ఇష్క్' నాట్ ఎ లవ్ స్టోరీ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.


అయితే ఆ సినిమా విడుదలకు సంబంధించిన ప్రమోషన్ లో భాగంగా విలేకరులతో నిర్వహించిన సమావేశంలో ఈ హీరో నా జీవితం మొత్తంలో నా యాక్టింగ్ కెరీర్ లో ఏ సన్నివేశం అయినా అలవోకగా చేయగలను అని ఒక రొమాన్స్ సీన్స్  మాత్రం చాలా కష్టమని చెప్పుకొచ్చాడు. మరియు ఇలాంటి కథతో తెలుగులో ఇంతవరకు సినిమాలు రాలేదు అని, సినిమా ప్రారంభం అయినప్పటి నుండి సినిమా ముగింపు అయ్యేవరకు సీట్ అంచుకి వచ్చి చేసే విధానం గా ఈ సినిమా ఉంటుంది అని తేజ  తెలిపాడు. అదేవిధంగా గా జులై 30వ తేదీ నా సినిమా విడుదల అవుతుంది అని తెలియజేశాడు. ప్రియా వారియర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు .ఈ సినిమాతో పాటు ఈ హీరో ప్రశాంత్ వర్మ కథను అందించిన అద్భుతం అనే సినిమాలో కూడా తేజ హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: