టాలీవుడ్ సినిమా చరిత్రలోనే క్లాసిక్ సినిమా గా మిగిలిపోతుంది రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో రికార్డులను సృష్టించింది. మంచి అవార్డులు రివార్డులు కూడా పొందిన ఈ సినిమాలో హీరోయిన్ సమంత నటించగా కీలకపాత్రలో ఆది పినిశెట్టి నటించాడు. రామ్ చరణ్ కెరీర్ లో నే ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకు మొదట హీరోయిన్ గా సమంతకు అనుకోలేదట.

మొదట అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా హీరోయిన్ గా ఎంపిక కాగా అమె కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో నటించలేకపోయింది. మలయాళ బ్యూటీ అయిన అనుపమ పరమేశ్వరన్ కు తెలుగులో మంచి గుర్తింపే ఉంది. నితిన్ హీరోగా నటించిన అ ఆ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత చాలా సినిమాలలో కనిపించి మంచి నటన కనపరిచింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు తెలుగులో సినిమా అవకాశాలు బాగా వచ్చాయి. అయితే ఈమె ఓ సినిమా చేస్తున్న సమయంలో రంగస్థలం సినిమా ఆఫర్ రాగా ఈమె ఆ సినిమాను వదిలేసుకుంది అని తెలుస్తుంది. 

చివరికి సుకుమార్ సమంతను ఎంపిక చేశాడు. ఏది ఏమైనా ఇంత పెద్ద హిట్ సినిమా ను చేయకుండా అనుపమ పరమేశ్వరన్ పెద్ద తప్పు చేసిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తెలుగులో ప్రేమమ్, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ , కృష్ణార్జున యుద్ధం, హలో గురు ప్రేమకోసమే, రాక్షసుడు వంటి చిత్రాలను చేసిన ఈమె ప్రస్తుతం నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 18 పేజెస్ సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలో తల్లి పోగాదే సినిమా లో కూడా నటిస్తుంది. భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ అయ్యే హీరోయిన్ గా ఈమె అని అభివర్ణిస్తున్నారు ఆమె అభిమానులు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ అందరినీ అలరిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: