"అర్జున్ రెడ్డి" చిత్రం టాలీవుడ్ లో ఓ సంచలనం. టీం మొత్తానికి ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ కెరీర్ ను ఓ రేంజ్ లో మలుపు తిప్పేసింది. సినిమా వివాదాస్పదమైనప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. మొత్తానికి ఓ ట్రెండ్ సెట్టింగ్ మూవీగా టాలీవుడ్ చరిత్రలో స్థానం సంపాదించుకుంది. ఇక ఇందులో జంటగా కన్పించిన విజయ్ దేవరకొండ, షాలిని పాండేల కెమిస్ట్రీ అదిరిపోయిందనే చెప్పాలి. షాలిని అమాయకమైన పేస్ సినిమాకు కలిసొచ్చిన అంశం. అసాధారణమైన కథాంశం, నటీనటుల నటన, దర్శకుడి ప్రతిభ ఇలా సినిమాకు సంబంధించిన అన్ని విషయాలపైనా ప్రశంసల జల్లు కురిసింది. అయితే ఈ సినిమాకు హీరోగా విజయ్ దేవరకొండ ఫస్ట్ ఛాయిస్ కాదనే విషయం తెలిసిందే. హీరో శర్వానంద్ ను మొదటగా ఈ చిత్రంలో హీరోగా అనుకున్నారట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల శర్వానంద్ ఈ బ్లాక్ బస్టర్ హిట్ నుంచి సైడ్ అయిపోవడంతో ఆ అద్భుతమైన అవకాశం విజయ్ దేవరకొండను వరించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే..

కానీ తెలియని విషయమేమిటంటే హీరోయిన్ షాలిని పాండే కూడా "అర్జున్ రెడ్డి" ఫస్ట్ ఛాయిస్ కాదు. షాకింగ్ విషయం కదా. ఆమెకన్నా ముందుగా "అర్జున్ రెడ్డి"లో హీరోయిన్ పాత్ర కోసం తమిళ నటి పార్వతి నాయర్‌ ను తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పార్వతి నాయర్ ఈ విషయాన్ని చెప్తూ "అర్జున్ రెడ్డి"ని వదులుకున్నందుకు తేగా బాధపడింది. అందులో రొమాంటిక్ సన్నివేశాలు చూసి భయపడిందట పార్వతి. అలాగే ఆ సమయంలో అది ఆమెకు ఒక సాధారణ ప్రేమకథగా అన్పించిందట. ఏమైనా సరే షాలిని పాండే ఈ సినిమాకు కరెక్ట్ గా సరిపోయింది. ప్రేక్షకులు ఆమె పాత్రలో మరొకరిని అస్సలు ఊహించుకోలేరు. ఇక పార్వతి నాయర్ బహుముఖ నటుడు కమల్ హాసన్ నటించిన "ఉత్తమ విలన్", తల అజిత్ "యెన్నై అరింధాల్" చిత్రాలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: