టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతున్న పూజా హెగ్డే.. ప్రస్తుతం మంచి సక్సెస్ రేటుతో దూసుకుపోతోంది.ప్రస్తుతం ఈ అమ్మడి ఖాతాలో వరుస హిట్స్ వుండటం.. అందులోనూ ఈ మధ్య బాలీవుడ్ లో కూడా పూజా కి డిమాండ్ పెరగడంతో ఈమె రేంజ్ రోజు రోజుకి అమాంతం పెరిగిపోతోంది.అయితే తాజాగా ఈ హీరోయిన్ కి సంబంధించిన ఓ విషయం ఆమె అభిమానుల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ఈ మధ్య పూజా హెగ్డే కి ఓ పిచ్చి బాగా పట్టుకుందట.ఆ పిచ్చి పేరే ఆన్లైన్ గేమ్స్.. అవును ఈ మధ్య పూజా హెగ్డే ఎక్కువగా ఇన్లైన్ గేమ్స్ ఆడుతుంటుందని..కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు మొబైల్ లో, ట్యాబుల్లో గేమ్స్ ఓపెన్ చేసి గంటల తరబడి అందులోనే లీనమైపోతున్నదని..

 ఆమె గురించి బాగా తెలిసిన కొందరు చెబుతున్నారు.గత కొద్ది రోజులుగా పూజా హెగ్డే కి గేమ్స్ పిచ్చి బాగా ఎక్కువ అవుతుందట.ఒకేసారి మూడు, నాలుగు సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉండే ఈ హీరోయిన్ కి గేమ్స్ ఆడే టైం అసలు ఎక్కడ దొరుకుతుంది..నిజానికి గేమ్స్ ఆడటానికి సమయం సరిపోవడం లేదని ఏకంగా ఈ మధ్య వచ్చిన ఓ కన్నడ సినిమా ఆఫర్ ని సైతం వదులుకుంది.మరి ఎలా గంటల తరబడి ఎందుకు గేమ్స్ ఆడుతున్నవని అడిగితే స్ట్రెస్ రిలీఫ్ కోసమని అంటుందట.అందుకే సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా గేమ్స్ ఆడుతున్న  ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది పూజా.

ఇక ఈ క్రమంలో నిన్న ఆదివారం తన ఇంట్లో ట్యాబ్ లో గేమ్ ఆడుతూ రిలాక్స్ అవుతున్న ఓ ఫోటోను పోస్ట్ చేసింది పూజా.మిగతా హీరోయిన్స్ ఏమో ఖాళీ సమయాల్లో వంటకాలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తుంటే.. మన బుట్టబొమ్మ మాత్రం గేమ్స్ ఆడుతూ రిలాక్స్ అవుతోంది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ సరసన వ్'రాధే శ్యామ్'తో పాటు అఖిల్ అక్కినేని కి జోడిగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో నటిస్తోంది.ఈ రెండు సినిమాల షూటింగ్స్ చివరి దశలో ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: