వకీల్ సాబ్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ చంద్ర దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్టయిన అయ్యప్పనుం కోషియం అనే సినిమాలో ఓ కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. రానా మరో కథానాయికగా నటిస్తుండగా వీరి సరసన నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ లు గా నటిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ రచయితగా చేస్తుండడం విశేషం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.

 తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ చిత్ర బృందం సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ చిత్రంలోని పవన్ కళ్యాణ్ లుక్ ను, పాత్రను రివిల్ చేసి వారిని ఎంతగానో ఖుషీ చేసింది. పవన్ ఏ పాత్ర పోషిస్తున్నాడనేది కూడా తెలియజేసింది. పోలీస్ డ్రెస్ లో కనిపిస్తున్న పవన్ భిమ్లా నాయక్ అనే పాత్రను పోషిస్తున్నట్లు నిర్మాత సూర్య దేవర నాగ వంశీ వెల్లడించారు. ఈరోజు హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైన ఈ సందర్భంగా ఈ పోస్టర్ ను ప్రేక్షకులతో పంచుకున్నారు చిత్ర బృందం.

ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ షెడ్యుల్ లో రానా మరియు పవన్ కళ్యాణ్ మధ్య హై ఓల్టేజ్ క్లైమాక్స్ ని షూట్ చేయనున్నారని తెలుస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ తో పాటు స్టంట్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ కూడా ఈ ఈ షూటింగ్ లో పాల్గొననున్నారని తెలుస్తుంది. మెగా అభిమానులను ఈ సినిమా ఎంతో థ్రిల్ కి గురిచేస్తుంది అని షూటింగ్ అయ్యే తీరును బట్టి తెలుస్తుంది.  ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ తో ఈ చిత్రం చిత్రీకరణ పూర్తవుతుందట. ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నాడు పవన్ కళ్యాణ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: