వకీల్ సాబ్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన పవన్
కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ చంద్ర దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్టయిన అయ్యప్పనుం కోషియం అనే సినిమాలో ఓ కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.
రానా మరో కథానాయికగా నటిస్తుండగా వీరి సరసన
నిత్యా మీనన్,
ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ లు గా నటిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి
త్రివిక్రమ్ రచయితగా చేస్తుండడం విశేషం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.
తాజాగా పవన్
కళ్యాణ్ అభిమానులకు ఈ చిత్ర బృందం సర్
ప్రైజ్ ఇచ్చింది. ఈ చిత్రంలోని పవన్
కళ్యాణ్ లుక్ ను, పాత్రను రివిల్ చేసి వారిని ఎంతగానో
ఖుషీ చేసింది. పవన్ ఏ పాత్ర పోషిస్తున్నాడనేది కూడా తెలియజేసింది.
పోలీస్ డ్రెస్ లో కనిపిస్తున్న పవన్ భిమ్లా
నాయక్ అనే పాత్రను పోషిస్తున్నట్లు
నిర్మాత సూర్య దేవర
నాగ వంశీ వెల్లడించారు. ఈరోజు
హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో
సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైన ఈ సందర్భంగా ఈ
పోస్టర్ ను ప్రేక్షకులతో పంచుకున్నారు చిత్ర బృందం.
ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ షెడ్యుల్ లో
రానా మరియు పవన్
కళ్యాణ్ మధ్య హై ఓల్టేజ్ క్లైమాక్స్ ని షూట్ చేయనున్నారని తెలుస్తోంది. దర్శకుడు
త్రివిక్రమ్ తో పాటు స్టంట్ కొరియోగ్రాఫర్స్
రామ్ లక్ష్మణ్ కూడా ఈ ఈ షూటింగ్ లో పాల్గొననున్నారని తెలుస్తుంది. మెగా అభిమానులను ఈ
సినిమా ఎంతో థ్రిల్ కి గురిచేస్తుంది అని షూటింగ్ అయ్యే తీరును బట్టి తెలుస్తుంది. ఈ భారీ యాక్షన్
ఎపిసోడ్ తో ఈ చిత్రం చిత్రీకరణ పూర్తవుతుందట. ఈ
సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు,
హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నాడు పవన్ కళ్యాణ్.