లాక్‌డౌన్ వేళ‌ టాలీవుడ్ లో చాలా మంది హీరోలు పెళ్లిల్లు చేసుకున్నారు. వారిలో లో యంగ్ హీరో నిఖిల్, రానా ద‌గ్గుబాటి, నితిన్ సహా మరికొందరు ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈ హీరోలంతా సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే వీరంతా విహార యాత్ర లకు కూడా వెళ్లి వచ్చారు. ఇక సందర్భాన్ని బట్టి ఈ హీరోలు తమ జీవిత భాగస్వామితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రేమను ఒలకబోస్తున్నారు. కాగా తాజాగా యంగ్ హీరో నితిన్ తన భార్య  షాలిని తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. నితిన్ షాలిని వివాహం జరిగి ఈరోజుకి ఏడాది కావస్తున్న సందర్భంగా నితిన్ తమ ఫోటోలను షేర్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. 

ఈ సందర్భంగా నితిత్ ....పెళ్లి రోజు శుభాకాంక్షలు. నా మిగిలిన జీవితం మొత్తం కూడా నీతోనే గడపాలని కోరుకుంటున్నాను. నా జీవితాన్ని ఇంత సులభంగా, ఇంత గొప్పగా మరియు ఇంత సంతోషంగా చేసినందుకు కృతజ్ఞతలు అంటూ షాలిని కి ముద్దు పెడుతున్న ఫోటోలను షేర్ చేశాడు. కాగా నితిన్ పోస్ట్ పై పై ఆయ‌న భార్య షాలిని కూడా  ప్రేమను చాటుతూ స్పందించింది. ఇప్పుడూ... ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు అద్భుతం అంటూ నితిన్ పై శాలిని ప్రేమ చూపించింది. ఇదిలా ఉండగా నితిన్ త‌న వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. 

ముంబైలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ ను నితిన్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడంతో ప్లాన్స్ అన్నీ నీళ్ళలో కలిసిపోయాయి. దాంతో చేసేది లేక హైదరాబాదులోనే నితిత్ త‌న కుటుంబ సభ్యులు బంధువుల మధ్య వివాహం చేసుకున్నాడు. ఇక మొత్తానికి అలా పెళ్లి చేసుకున్న నితిన్ ఇప్పుడు భార్యతో హ్యాపీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉండ‌గా నితిన్ సినిమా విష‌యానికి వ‌స్తే డ‌బుల్ స్పీడ్ తో సినిమాల‌ను ప‌ట్టాలెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతం నితిత్ మ్యాస్ట్రో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా బాలీవుడ్ లో మంచి విజ‌యం సాధించిన అందాదున్ సినిమాకు రీమేక్ గా తెర‌కెక్కుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: