టాలీవుడ్ లో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగొందుతోంది కన్నడ హీరోయిన్ రష్మిక మందన. ఛలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత గీత గోవిందం, భీష్మ, సరిలేరు నేకెవ్వరు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప అనే భారీ బడ్జెట్ సినిమా లో నటిస్తుంది. బాలీవుడ్ లో సైతం మూడు సినిమాలకు సైన్ చేసి బిజీ హీరోయిన్ గా మారింది రష్మిక. తమిళంలో ఇటీవలే కార్తీ నటించిన సుల్తాన్ సినిమా తో అక్కడ కూడా పాగా వేయాలని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ హైదరాబాద్ టు ముంబై వయా చెన్నై అంటూ  తిరుగుతూ సినిమా షూటింగ్ లలో  పాల్గొంటూ బిజీగా క్షణమైనా తీరిక లేకుండా గడుపుతుంది.  తాజాగా తెలుగులో ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో కూడా ఒప్పుకొని శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇదే కాకుండా మరి కొన్ని సినిమాలను ఒప్పుకునే ఆలోచన చేస్తుంది ఈమె. బాలీవుడ్ లో సిద్దార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను అనే చిత్రంలో నటిస్తుంది ఈమె. అంతేకాదు అమితాబ్ తో కూడా ఓ సినిమాలో నటిస్తుంది ఈమె.  

అయితే ఇటీవలే లాక్ డౌన్ ఎత్తివేయడంతో అన్ని షూటింగ్ లు ఒకేసారి మొదలుకావడంతో ఆమెకు క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతుంది. హైదరాబాద్ కు ముంబై కి ఒక్కరోజు షూటింగ్ ఉన్నా కూడా జర్నీ చేయాల్సి వస్తుందట. నిన్న మొత్తం మిషన్ మజ్ను షూటింగ్ లో పాల్గొన్న రష్మిక ఈ రోజు ఉదయం వెంటనే ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యిందట. ఒకేసారి రెండు వేరు వేరు చోట్ల షూటింగ్ అంటే అంత ఈయాజి కాదు కానీ రష్మిక ఇలా క్షణం కూడా తీరిక లేకపోవడంతో షూటింగ్ లు చేయడం చూస్తూనే రష్మిక ఎంత బిజీగా ఉందొ అర్థం అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక నెంబర్ వన్ హీరోయిన్ చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: