టాలీవుడ్ లో అక్కినేని హీరో నాగ చైతన్య సరసన 'సవ్యసాచి' సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది నిధి అగర్వాల్. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాలలో నటించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు.ఇక తెలుగులో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో యయూత్ లో మంచి పాపులారిటీని తెచ్చుకుంది నిధి అగర్వాల్. ఇక తెలుగులోనే కాకుండా తమిళంలో కూడాభూమి, ఈశ్వరన్ వంటి సినిమాలతో అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ,క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు' సినిమాతో పాటూ..

 మహేష్ బాబు మేనల్లుడు హీరోగా పరిచయం అవుతున్న 'హీరో' సినిమాలతో బిజీగా ఉంది.ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ హీరోయిన్ చేసిన కొన్ని కామెంట్లు ఆమె అభిమానులని డిజప్పాయింట్ చేసాయి.ఇంతకీ విషయం ఏమిటంటే..గ్లామర్ షో చేయడానికి నిధి అగర్వాల్ ఎక్కడా తగ్గదు. ఇప్పటికే ఆమె నటించిన గత సినిమాల్లో గ్లామర్ రోల్స్ కో మెరిసింది.అలాగే ముద్దు సీన్లలో కూడా ఈ భామ ఇంతో యాక్టివ్ గా నటిస్తుంది.దీంతో వాన పాటల్లో కూడా ఈమె నర్తిస్తే కచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుందని ఆమె అభిమానులు భావించారు.కానీ ఈ విషయంలో నిధి అగర్వాల్ ఫ్యాన్స్ కి పెద్ద షాకే ఇచ్చింది.

'వాన పాటలంటే తనకు చాలా చిరాకని..వానలో తడవడం,బట్టలు ఆరబెట్టుకోవడం,మళ్ళీ తడవడం చాలా చిరాగ్గా అనిపిస్తాయని..వాన పాట షూటింగ్ అంటే నరకమే అని..పలువురు దర్శకనిర్మాతలకు చెప్పుకొచ్చిందట ఈ ఇస్మార్ట్ భామ.అంతేకాదు ఇప్పట్లో తనకోసం అలాంటి వాన పాటలు ప్లాన్ చేయవద్దని తెగేసి మరి చెప్పిందట.దీంతో ఈ అమ్మడు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు తన కామెంట్స్ తో ఫ్యాన్స్ సైతం డిజప్పాయింట్ చేసింది నిధి అగర్వాల్.ఇక అతి త్వరలోనే హరిహర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ కానుంది నిధి అగర్వాల్. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తనకు మొదటి సినిమా ఇదే కావడం విశేషం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: