ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రౌద్రం రణం రుధిరం అనే భారీ పాన్ ఇండియా సినిమా తీస్తున్న రాజమౌళి, దీని అనంతరం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తో మరొక భారీ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నట్లు టాక్. ఇక అసలు విషయం ఏమిటంటే దీని తరువాత ఏకంగా బాలీవుడ్ టాప్ స్టార్ బాద్షా షారుక్ ఖాన్ తో రాజమౌళి ఒక గొప్ప భారీ మూవీ తీయనున్నారు అనేది లేటెస్ట్ బి టౌన్ టాక్.
ఇప్పటికే కథకుడు విజయేంద్ర ప్రసాద్ ఈ బడా మూవీ కి సంబందించి ఒక అద్భుతమైన స్టోరీ లైన్ సిద్ధం చేసారని, అలానే దీనికి సంబందించిన అఫీషియల్ న్యూస్ ఆగష్టు మొదటి వారం లో రానుందని సమాచారం. ఇప్పటివరకు వచ్చిన పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే వాటికి అమ్మ మొగుడు అనే రేంజ్ లో కనీ వినీ ఎరుగని స్థాయిలో రాజమౌళి ఈ సినిమా తీయనున్నారట. మరి ఇదే కనుక నిజం అయితే ఆ మూవీ తో దర్శకుడుగా రాజమౌళి హాలీవుడ్ రేంజ్ ని అందుకోవడం ఖాయం అంటున్నాయి భారతీయ సినిమా వర్గాలు .... !!