కరోనా సెకండ్ వేవ్ తర్వాత పుష్ప సినిమా ప్రస్తుతం భాగ్యనగరంలో జరుగుతోంది. ఈ సినిమాలో ఐటెమ్ పాట గురించి చాలా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ పాటకోసం జాక్వెలిన్ ఫెర్ర్నందేజ్, దిశా పఠాణిని సంప్రదించినట్లు టాక్ వినిపించగా ఇంతవరకు ఎవరిని అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కు మంచి ప్రత్యేకత ఉంది. ఈ ఐటమ్ సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలవనుందట.అందుకే మంచి పేరు ఉన్న హాట్ యాక్టర్ ని తీసుకోవాలని చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం.తాజాగా అందిన సమాచారం మేరకు సన్ని లియోన్ను ఐటమ్ సాంగ్ కోసం చిత్రబృందం సంప్రదించిందట. అయితే ఈ పాటకు భారీగానే రెమ్యూనరేషన్ అడిగిందట.ఇదిలా ఉంటే టాలీవుడ్ లో అల్లుఅర్జున్ డాన్స్ ఎంతో ఇష్టమని సన్నీలియోన్ తెలిపినట్లు సమాచారం. అల్లుఅర్జున్ కోసం తన రెమ్యూనరేషన్ తగ్గించుకుందో లేదో మరి చూడాలి.
ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఓ భారీ యాక్షన్ సినిమా ఇది . దీంతో ఈ చిత్రం షూటింగు ఎక్కువ భాగాన్ని అడవిలో చిత్రీకరిస్తున్నారు. అందులో భాగముగా కొన్ని సన్నివేశాలను కేరళ అడవులలో చిత్రికరించడం జరిగింది.ఈ సినిమాలో కూడా సుకుమార్ అల్లుఅర్జున్ ని ఒక పక్కా మాస్ లుక్ లో చూపిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న భారీ మాస్ యాక్షన్ సినిమా ఇది.ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజు అనే మాస్ పాత్రలో నటిస్తుండగా, రష్మిక మందన గిరిజన యువతీ పాత్రలో కనిపించనుంది.ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సన్నీలియోన్ ను ఐటమ్ పాటలో తీసుకుంటారో లేదో చూడాలి మరి.