తెలుగు ఓటీటీ ఆహా టాలీవుడ్ లో స్మాల్ బడ్జెట్ సినిమాల నుండి మీడియం బడ్జెట్ సినిమాల వరకు అన్నిటిని కొనేస్తుంది. దీనితో పాటుగా ఆహా ఒరిజినల్ వెబ్ సీరీస్ లతో కూడా అలరిస్తుంది. లేటెస్ట్ గా యువి క్రియేషన్స్ వారితో ఆహా భారీ డీల్ సెట్ చేసుకుందని తెలుస్తుంది. ప్రభాస్ లాంటి హీరోతో భారీ సినిమాలు చేయడమే కాదు సంతోష్ శోభన్ లాంటి యువ హీరోతో సినిమాలు చేస్తున్నారు యువి క్రియేషన్స్. లేటెస్ట్ గా మారుతి డైరక్షన్ లో మంచి రోజులు వచ్చాయి సినిమా యువి కాన్సెప్ట్ బ్యానర్ లో వచ్చింది.

సినిమా మూడున్నర కోట్ల బడ్జెట్ తో కేవలం నెల రోజుల షూటింగ్ తో పూర్తి చేశాడట మారుతి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఆహాకు అమ్మేసినట్టు తెలుస్తుంది. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయాలని అనుకున్నా ఎలాగు థియేతర్లు ఓపెన్ చేస్తున్నారు కాబట్టి థియేట్రికల్ రిలీజ్ చేసి త్వరగానే ఆహా ఓటీటీలో రిలీజ్ చేసేలా చూస్తున్నారు. ఇదే కాకుండా యువి క్రియేషన్స్ లో తెరకెక్కుతున్న గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమా.. మహి డైరక్షన్ లో శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తున్న ఫీమేల్ సెంట్రిక్ సినిమా.. సంతోష్ శోభన్ తో చేస్తున్న మరో స్మాల్ బడ్జెట్ సినిమా వీటన్నిటిని కలిపి 13 కోట్లకు ఆహాకు అమ్మేశారట.

కేవలం డిజిటల్ రైట్స్ తోనే యువి క్రియేషన్స్ లాభాల బాట పట్టిందని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలన్ని 13 కోట్లకు కాదు 17 కోట్లకు ఆహా కొనేసిందని టాక్ వస్తుంది. ఏది ఏమైనా యువి బ్యానర్ లో వచ్చే స్మాల్ బడ్జెట్ సినిమాలన్ని ఆహాలో రిలీజ్ అవుతున్నాయి. డిజిటల్ రైట్స్ తో పాటుగా శాటిలైట్ రైట్స్ తో కూడా చూస్తే యువి క్రియేషన్స్ లాభాల పంట పండినట్టే అని చెప్పొచ్చు. ఆహా కూడా ఈ సినిమాలతో తన సబ్ స్క్రైబర్స్ ను ఫుల్ ఎంటర్టైన్ చేయనుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: