తెలంగాణలో థియేటర్లు తెరుచుకునే అవకాశం ప్రభుత్వం కల్పించినా.. ఆంధ్రప్రదేశ్లో థియేటర్లు మూసి ఉండటంతో సినిమాలు విడుదల చేయటానికి నిర్మాతలు సాహసించలేకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఓటీటీ కూడా ఒక కారణంగా మారింది. సినిమా థియేటర్లు ఓపెన్ కాకపోవడం ఓటీటీలో కూడా సినిమాలను విడుదల చేసే అవకాశం ఉండడంతో థియేటర్ల విషయంలో మాత్రం కాస్త ఆలస్యంగానే విడుదల చేసేందుకు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నారు.
చాలా రోజుల తరువాత ఈ శుక్రవారం పలు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కానీ అందులో రెండు సినిమాల మీదనే ఆసక్తి ఉందని తెలుస్తోంది. అందులో ఒకటి సత్యదేవ్ నటించిన తిమ్మరసు కాగా.. రెండోది తేజా సజ్జా నటించిన ఇష్క్ మూవీలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు 30 వ తేదినా థియేటర్లలో సందడి చేయనున్నాయి. తేజా సజ్జ, ప్రియా వారియర్ నటించిన ఇష్క్ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ తాజాగా ఏర్పాటు చేశారు.
ఈ మీడియా సమావేశానికి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకులకు పలు సూచనలు చేశారు. థియేటర్లలో ప్రెక్షకులు మాస్కు వేసుకుని మాత్రమే చూడాలని కోరారు. ఈ విధంగా చెప్పిన దిల్రాజు ప్రెస్ మీట్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చే సమయంలో పక్కనా చాలా మంది ఉన్నా దిల్ రాజు మాత్రం మాస్క్ పెట్టుకోకుండానే ఉన్నారు. ప్రెస్ మీట్ జరిగేటప్పుడు కూడా మాస్క్ ధరించింది లేదు. అయితే ముందుగా ఆయన కరోనా నిబంధనలుఏ పాటించి ఇతరులకు చెప్పాలనే అభిప్రాయం కూడా పలువురి నుంచి వ్యక్తమవుతోంది.