కృతి సనన్.. ఈ పేరు వినగానే ప్రస్తుతం ఆది పురుష్ సినిమా గుర్తుకొస్తుంది. పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ సినిమాలో, హిందీలో హీరోయిన్ గా కృతిసనన్ నటిస్తోంది. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటే, ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే తెలుగులో మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే చిత్రం ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయం అయింది. 2014లో తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అరంగేట్రం చేసింది కృతిసనన్. ఇక ఇదే ఈమె మొదటి సినిమా.


అదే ఏడాది హిందీలో కూడా జాకీ ష్రోఫ్ కుమారుడు అయిన  టైగర్ ష్రోఫ్ సరసన హీరోపంతి అనే సినిమా ద్వారా హిందీ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇకపోతే కృతిసనన్ 1990 వ సంవత్సరం జూలై 27 వ తేదీన ఢిల్లీలో జన్మించింది. ఈమె మొదట మోడల్ గా పనిచేసి, ఆ తర్వాత మహేష్ బాబు సినిమాతో హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే 2014లో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో, హీరోయిన్ సమంత తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఎన్నుకున్నారు. వారిలో ఒకరు నిత్యామీనన్ ,మరొకరు కృతిసనన్. కానీ కొన్ని కారణాల వల్ల కృతి సనన్ ఈ సినిమాలో నటించలేదు.ఏది ఏమైనా ఏమిటి తెలుగులో   కంటి అక్కడే బాగా రాణిస్తోంది


ఈరోజు కృతిసనన్ 31వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా, ప్రముఖ దర్శకుడు,నిర్మాత, రచయిత అయిన ఓం రౌత్ , కృతి సనన్ పుట్టినరోజు సందర్భంగా వారిద్దరి మధ్య ఎన్నో సంభాషణలు జరిగాయని, ఎంతో నవ్వుకున్నాము.ఇక పుట్టినరోజు శుభాకాంక్షలు కృతి  అంటూ ఒక పోస్టర్ ను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: