‘బాహుబలి’ సినిమాతో టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. నెక్స్ట్ సినిమా ‘సాహో’తో డిఫరెంట్ ప్రయోగం చేసి ఫ్యాన్స్‌ను మెప్పించాడు. ఇక తర్వాత చిత్రాలన్నీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ఉండబోతున్నాయి. కాగా, ఇందుకు సంబంధించి పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుంటున్నాడు. ప్రభాస్. తాజాగా ఒక సినిమాలో ఇంపార్టెంట్ సీక్వెన్స్ కోసం దాదాపు 9 నెలలు కేటాయించాడు. ఈ విషయం తెలుసుకుని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ సినిమా అభిమానులు, సినీ లవర్స్ కోసం ఎంతో ఇంట్రెస్టింగ్‌గా చేయడం ద్వారా ప్రభాస్ తన పాపులారిటీని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని సినీ పరిశీలకులు పేర్కొంటున్నారు.

టాలీవుడ్ నుంచి మొదలై బాలీవుడ్‌ను ఏలుతున్నాడు. బిగ్గెస్ట్ స్టార్స్‌తోనూ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. విదేశాల్లోనూ ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉన్న కథలను ఎంచుకుంటున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్లస్ యాక్షన్ బ్యాలెన్స్ అయ్యేలా చూసుకుంటున్నారు. ‘సాహో’ వంటి యాక్షన్ ఎంటర్‌టైనర్ తర్వాత ప్రజెంట్ ప్రభాస్ లవ్ స్టోరీ మూవీ చేస్తున్నాడు అదే ‘రాధేశ్యామ్’.అయితే, ఇది పూర్తి ప్రేమకథా చిత్రం కాకుండా పీరియాడిట్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా కోసమే దాదాపు 9 నెలల టైం కేటాయించాడు డార్లింగ్ ప్రభాస్. ఇక ఆ తర్వాత చిత్రాలు కూడా వైవిధ్యమైనవే ఎంచుకున్నాడు ప్రభాస్. మర్యాద పురుషోత్తముడు రాముడి ఫాంటసీ బయోపిక్‌గా ‘ఆదిపురుష్’ తెరకెక్కుతోంది. రామాయణం ఆధారంగానే ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ప్రభాస్ జనాల మనసులో నిలిచిపోతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.  ఈ ఫిల్మ్ తర్వాత ‘కేజీఎఫ్’ ఫేమ్ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌తో ‘సలార్’ చిత్రం చేస్తున్నారు. ఇందులో ప్రభాస్‌కు సరసన శ్రుతిహాసన్ నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత ‘మహానటి’ ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో ఓ చిత్రం చేస్తున్నాడు ప్రభాస్. ఇందులో బాలీవుడ్ స్టార్స్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: