వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోయిన్ గా రయ్ మంటూ దూసుకొచ్చిన రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత వెను తిరిగి చూసింది లేదు. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా అందరి యంగ్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. గ్లామర్ ను వలకబోసిన ఈ చిన్నది తన అభినయంతో ప్రేక్షకుల మన్నలను పొందింది. అయితే ఈ మధ్య కాలంలో తెలుగులో రకుల్ జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. హిందీ, తమిళ భాషలలో మాత్రం స్పీడు పెంచారు. ప్రస్తుతానికి ఈ అందాల తార చేతిలో అరడజనుకు పైగానే సినిమాలున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్‌ హీరో జాన్‌ అబ్రహం కు జంటగా "అటాక్" అనే చిత్రంలో నటిస్తోంది. లక్ష్యరాజ్‌ ఆనంద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా తెలుగులో ఓ స్పెషల్ సాంగ్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదించగా అందుకు రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ లో ఈమె ఓ స్పెషల్ సాంగ్ చేయబోతోంది అంటూ ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఓ వైపు హీరోయిన్ గా  కొనసాగుతూనే మరోవైపు స్పెషల్ సాంగ్ కి సరే అన్నట్లు సమాచారం. మంచి ఆఫర్ రావడంతో కాదనలేక ఓకే చెప్పారట రకుల్. ఇప్పటి వరకు ఈమె ఎప్పుడు పవన్ సరసన నటించనే లేదు. కానీ వీరిద్దరి జోడీ మాత్రం అదిరిపోయేలా ఉంటుందని అంటున్నారు మెగా అభిమానులు.అయితే ఈ సినిమా ఏది అనేది ఇంకా తెలియలేదు. కానీ బండ్ల గణేష్ నిర్మిస్తున్న దేవర సినిమా కోసం అని తెలుస్తోంది. ఈ విషయంపై ఓ  క్లారిటీ రావాల్సి ఉంది. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ అందాల భామ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: