అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్, అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన 'సవ్యసాచి' సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాన, ఈ హాట్ బ్యూటీ అందచందాలకు, నటనకు సినీ జనం నుండి మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత కూడా అక్కినేని ఫ్యామిలీ కి సంబంధించిన మరో హీరో అయినా అఖిల్ తో కూడా 'మిస్టర్ మజ్ను' సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా ఈ ముద్దుగుమ్మకు నిరాశనే మిగిల్చింది. ఇలా చేసిన రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయినా ఈ హాట్ బ్యూటీ కి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా లో హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావడంతో ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉంది.


 తాజాగా ఈ హాట్ బ్యూటీ ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. సినిమాలకు సంబంధించి వర్షం పడుతున్నప్పుడు డాన్స్ చేయడం అంత ఈజీ కాదని, పై నుండి వర్షం పడుతూ ఉంటే కళ్ళు తెరుచుకుని ఉండి సుచువేషన్ కు తగిన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం నావల్ల కాదు అని, అందుకే వాన పాటలకు దూరంగా ఉంటాను అని, ఇప్పట్లో వాన పాటలు చేయడం గురించి ఆలోచించట్లేదు అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా తనకు మంచి విజయాన్ని అందిస్తుంది అనే ఆశాభావంతో నిధి అగర్వాల్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా నిధి అగర్వాల్ కు ఎలాంటి విజయాన్ని తీసుకువస్తుందో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: