సినిమా ఇండస్ట్రీలో బండ్ల గణేష్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే ఈయన పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అని చెప్పవచ్చు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా ఈయన పేరు వినబడుతూంటుంది. ఇక బొత్సకు, బండ్ల గణేష్ కు ఉన్న సంబంధం ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.

మొదట కమెడియన్ గా సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన బండ్లగణేష్, ఆ తర్వాత నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలను నిర్మించాడు. ఇక అందరూ ఈయనని  బొత్స సత్యనారాయణ బినామీ అని అంటుంటారు అట. అసలు "బొత్స సత్యనారాయణకు తానేమీ బినామీ కాదని"..నేను కేవలం ఆంధ్ర బ్యాంకు మాత్రమే బినామీని అని బండ్ల గణేష్  తెలిపాడు"

ఎందుచేతనంటే, నేను ఆ బ్యాంకు లోనే లోన్ తీసుకొని, సినిమాలకు ఖర్చు చేస్తుంటాను అని తెలిపాడు. అలా నేను సినీ నిర్మాతగా వ్యవహరిస్తున్న అప్పుడే, బొత్స సత్యనారాయణకు , నాకు పరిచయం అవడం జరిగింది. అలా ఆయనతో నేను చాలాసార్లు మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడినందుకు వలన ఆయన బినామీ అనుకున్నారు నన్ను.

కానీ దురదృష్టం ఏమిటంటే, ఇంకా ఇప్పటికీ ఆయన బినామీనే అనుకుంటున్నారు నన్ను ప్రేక్షకులు. కేవలం ఇదే మా ఇద్దరి మధ్య ఉండేది అని తెలిపాడు " బండ్ల గణేష్. ఇక పవన్ కళ్యాణ్ కి చాలా సంవత్సరాల కిందటి నుంచి పరిచయం ఉందని తెలిపాడు. మొదటగా సుస్వాగతం సినిమా ద్వారా వీరిద్దరు బాగా స్నేహపూర్వకంగా ఉండేవారట. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు అలాగే కొనసాగిస్తున్నామని బండ్లగణేష్ తెలిపాడు.

ఇక దానితోనే పవన్ కళ్యాణ్ సినిమాలకు నిర్మాతగా మారాడు బండ్లగణేష్.. ఇక నాకు చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలని కోరిక ఉండేది అని తెలిపాడు అందుచేతనే ముందు కె.ఎస్.రామారావు దగ్గర జీతం తీసుకోకుండా పని చేశానని తెలిపాడు. ఇక తర్వాత నాకు ఎస్ వి కృష్ణారెడ్డి గారు సినిమాలలోని కొన్ని పాత్రలు ఇచ్చారు. అలా సినీ ఇండస్ట్రీ వైపు కు వచ్చాను అని తెలిపాడు బండ్ల గణేష్.


మరింత సమాచారం తెలుసుకోండి: