అవేంటంటే..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు జీవిత బీమాకు చెల్లించాల్సిన ప్రీమియంతో పాటు జీవిత సభ్యత్వాలను ఇవ్వడం గురించి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమావేశంలో ఈసీ సభ్యులతో పాటు క్రమశిక్షణా సంఘ చైర్మన్ కృష్ణంరాజు, న్యాయసలహాదారు, ఆడిటర్ పాల్గొనున్నారు. అయితే, రెబల్ స్టార్ కృష్ణం రాజు ఎన్నికల్లో కాకుండా క్రమశిక్షణా సంఘం చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ‘మా’మీటింగ్ను వర్చువల్గా నిర్వహించనున్నారు. ‘మా’ సంస్థ ఏర్పడిన తర్వాత వర్చువల్ మీటింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి. కాగా, ఒకవేళ కొవిడ్ థర్డ్ వేవ్ ఎఫెక్ట్ లేకపోతే సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించే అవకాశముంటుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ విషయమై ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ డెసిషనే ఫైనల్గా ఉండనుంది.