బాలీవుడ్ లో పోర్నోగ్రఫీ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఈ పోర్నోగ్రఫీ ఆరోపణలతో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఇటీవలే అరెస్ట్ అయ్యాడు. అయితే అది ఇప్పుడు బాలీవుడ్ లో పెను సంచలనంగా మారింది. ఈ కేసులో రాజ్ కుంద్రా భార్య శిల్పాశెట్టి కి ఉచ్చు బిగుస్తున్నట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. అశ్లీల వీడియోలు చిత్రీకరణ రాకెట్ లో రోజురోజుకు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో శృంగార తార షెర్లిన్ చోప్రాకు పోలీసులు ఇటీవలే సమన్లు జారీ చేశారు.

అలాగే ఈ కేసుకు సంబంధించిన అందరినీ విచారిస్తున్నారు. ఇప్పటికే రాజ్ కుంద్రా బ్యాంక్ అకౌంట్ లు అన్ని సీజ్ చేశారు.ఆయనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తున్నారు పోలీసులు.  ముమ్మరంగా దీన్ని దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతోంది ముంబై క్రైం బ్రాంచ్.  ఈ కేసు అనేక సంచలనాలకు కేంద్ర బిందువు గా మారడం, మనీలాండరింగ్ లాంటి అంశాలు వెలుగు చూడడంతో ఈ కేసు ద్వారా ఎంతో మంది పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. గత రెండు రోజులుగా మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ జరుపుతున్న విచారణలో కొన్ని సంచలన విషయాలు తెలుస్తున్నాయట. 

పోర్న్ రాకెట్ కేసు ఇతరులకు ఏమో గానీ శిల్పా శెట్టి మెడకు చుట్టుకుంటున్నట్లు అర్థమవుతుంది. ఈ వ్యవహారంలో ఆమె పాత్ర ఉంది అని నిరూపించేందుకు ఆమె ఫోన్ నీ క్లోన్ చేయాలని నిర్ణయించారు. ఆమె ఫోన్ ను క్లోన్ చేసి అందులో విషయాలను బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో శిల్పాశెట్టి పాత్ర ఉందని అధికారులు బలంగా నమ్ముతున్నారు. త్వరలోనే ఆమెను అరెస్టు చేసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఆమె అకౌంట్లోకి కోట్ల రూపాయల నగదు చేరిందని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ బ్యాంక్ అకౌంటర్లు కూడా అనుమానాస్పదంగా కనిపించడంతో ఈడీ రంగంలోకి దిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: