ఇందులో హీరో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు అని సమాచారం.ఇది ఇలా ఉండగా సలార్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో భారీ మార్పులు చేస్తున్నారు.సినిమా నిడివి ఎక్కువవ్వడంతో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని చాలావరకు తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది.దాన్ని బట్టి స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారట.ప్రస్తుతం రాధే శ్యామ్, అదిపురుష్ షూటింగ్ లతో ప్రభాస్ బిజీగా ఉన్నారు.ఓం రావుత్ డైరెక్ట్ చేస్తున్న ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు చేస్తున్నాడు.ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో రావణాసురుడిగా కనిపించబోతున్నారు.
భారీ అంచనాలతో ఈ సినిమా ఉండబోతోంది.మరోవైపు నాగ్అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు ప్రభాస్.ఇటీవలే ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ఓ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకునే ప్రభాస్ కి జోడీగా నటిస్తోంది.బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. అమితాబ్ బచ్చన్ పై చిత్ర యూనిట్ కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు...!!