సాహో తర్వాత రాధాకృష్ణ డైరక్షన్ లో రెండేళ్ల క్రితం స్టార్ట్ అయిన ప్రభా రాధే శ్యాం సినిమా ఇప్పటికి సెట్స్ మీద ఉంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అప్డేట్స్ పై ఫ్యాన్స్ చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నారు. సినిమా నుండి ఇప్పటి వరకు సరైన టీజర్ కూడా ఒకటి రిలీజ్ కాలేదని రిలీజైన కాన్సెప్ట్ టీజర్ కూడా ఆశించే స్థాయిలో లేదన్నది అభిమానుల వాదన.

మరో షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా నుండి అర్జెంట్ గా ఒక అదిరిపోయే టీజర్ ఒకటి కావాలని అంటున్నారు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్. అంతేకాదు రాధే శ్యాం అప్డేట్స్ ఏమి రిలీజ్ చేయట్లేదని యువి క్రియేషన్స్ మీద ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన కామెంట్ల దాడి తెలిసిందే. సోషల్ మీడియాలో అప్పట్లో అది హాట్ టాపిక్ అయ్యింది. ఫ్యాన్స్ వెయిటింగ్ అంతా గమనిస్తున్న చిత్రయూనిట్ త్వరలో ఓ అదిరిపోయే టీజర్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట.

ప్రభాస్ రాధే శ్యాం నుండి నిమిషం కి పైగా ఉన్న టీజర్ ఒకటి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ టీజర్ తో సినిమా స్టోరీతో పాటుగా గ్రాండియర్ కూడా తెలిసేలా చేస్తున్నారని టాక్. ప్రభాస్ ఫ్యాన్స్ రాధే శ్యాం మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. సినిమాలో లక్కీ హీరోయిన్ పూజా హెగ్దే కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ప్రభాస్, రాధే శ్యాం ఇద్దరి జోడీ రాధే శ్యాం మూవీకి స్పెషల్ ఎట్రాక్షన్ గా అవుతుందని అంటున్నారు. పిరియాడికల్ లవ్ స్టోరీగా రాబోతున్న రాధే శ్యాం సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్ని అంచనాలతో వచ్చినా ఆ అంచనాలను మించి సినిమా ఉంటుందని చెబుతున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ పై కూడా రాధే శ్యాం టీం ఒక క్లారిటీ ఇవ్వనుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: