రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన "బాహుబలి" సినిమాతో దేశవ్యాప్తంగా ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక దేశం నలుమూలాల ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. ఇక బాహుబలి సినిమాతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ అక్కడి నుంచి ఏమాత్రం తగ్గకుండా వరుస పెట్టి పెద్ద పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈ నేపథ్యంలో తన సన్నిహిత బ్యానర్ యువి క్రియేషన్స్ తో రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. అందులో ఒకటి 'సాహో' కాగా మరొకటి 'రాధే శ్యాం'. ఈ రెండు సినిమాలు యువి క్రియేషన్స్ బ్యానర్ వే. ఇక ఇందులో సాహో సినిమా ఫ్యాన్స్ ని ఊరిస్తూ చాలా అంటే చాలా లేట్ గా రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. ఇక రాధేశ్యాం కూడా ఇప్పుడు నిర్మాణ దశలో వుంది.

ఇక యువి క్రియేషన్స్ వారి తీరుపై ప్రభాస్ ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు.దానికి కారణం ఆ బ్యానర్ లేట్ అప్డేట్స్. అవును సాహో విషయంలో చేసిన ఆలస్యమే ఈ సినిమా విషయంలో కూడా చేస్తున్నారు యువి వారు.రాధేశ్యాం కంటే చాలా లేట్ గా స్టార్ట్ అయిన సినిమాలు కూడా కొత్త అప్ డేట్స్ ఇస్తుంటే యువి వారు మాత్రం నత్తలా చాలా స్లో అప్ డేట్స్ ఇస్తున్నారు. ఇక తాజాగా 'ఆర్ ఆర్ ఆర్' నిర్మాణ సంస్థ వరుస అప్ డేట్స్ ఇస్తుండగా.. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా లేటెస్ట్ అప్ డేట్ కూడా వచ్చింది.ఇక ఇవి ఇంత ఫాస్ట్ గా అప్డేట్స్ ఇస్తుంటే యువి వారు మాత్రం ఎప్పుడో తమకిష్టం వచ్చినప్పుడు అప్ డేట్ ఇస్తున్నారు. ఇక ఈ విషయంలో అనేక మీమ్స్ తో తమ బాధని చెప్పుకుంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: