పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నాలుగు ప్రాజెక్టులు కూడా సెట్స్ పైనే ఉండటం విశేషం. వీటిలో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చే చిత్రం 'రాధే శ్యామ్'.ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉంది. నిజానికి ఈ సినిమాను జూలై 30 న విడుదల చేయబోతున్నట్లు 2021 ఆరంభంలోనే ప్రకటించారు యూనిట్ సభ్యులు.కానీ అంతలోనే కరోనా సెకండ్ రావడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది.దాంతో జులై 30 న ఈ సినిమా విడుదల అవ్వడం లేదని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం..అదే డేట్ కి అంటే జూలై 30 న రాధే శ్యామ్ టీమ్ ఓ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.అదే రాధే శ్యామ్ కొత్త విడుదల తేది గురించిన అప్డేట్.ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఇంకా అతి కొద్ది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుందట.అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా కన్నా ముందే ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. కానీ ఇప్పటి వరకు షూటింగ్ కంప్లీట్ కాలేదు.ఇక తాజా సమాచారం ప్రకారం రాధే శ్యామ్ షూటింగ్ ని వేగంగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.సెకండ్ వేవ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ని హైదరాబాద్ లో ప్రారంభించారు. 

ఇప్పటికే హీరో, హీరోయిన్ల పై ఓ పాట కూడా చిత్రీకరించారు. ఇక ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా జూలై 30 న ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.ఇక రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.1920 ఇటలీ లో సాగే ఓ పీరియాడికల్ లవ్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు రాధాకృష్ణ. ఇక ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలను కూడా మళ్ళీ సెట్స్ పైకి తీసుకెళ్లి..వాటి వాటి షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు ప్రభాస్.రాధే శ్యామ్ షూటింగ్ అనంతరం సలార్, ఆదిపురుష్ సినిమా షూటింగ్లను ఏకకాలంలో పూర్తి చేయాలని భావిస్తున్నాడట ఈ పాన్ ఇండియా హీరో..!!

మరింత సమాచారం తెలుసుకోండి: