టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణ ల జోడికి ఆడియన్స్ నుండి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో నాగార్జున తండ్రీ, కొడుకులు గా రెండు పాత్రలను పోషించాడు.ఇక రమ్యకృష్ణ తో పాటూ లావణ్య త్రిపాఠి కూడా మరో హీరోయిన్ గా నటించింది.ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా బంగార్రాజు అనే ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఇక ఈ సీక్వెల్ లో అక్కినేని వారసుడు నాగ చైతన్య కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

అంతేకాదు చైతూ కి జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఇదిలా ఉంటె ఈ సినిమాలో నాగార్జున కి జోడిగా మరో హీరోయిన్ శ్రీయ ఫైనల్ అయినట్లు సమాచారం.అయితే ఈ సీక్వెల్ లో మళ్ళీ నాగార్జున, రమ్యకృష్ణ ల జోడీ ఉండబోతోందని అభిమానులు భావించారు.కానీ నాగార్జున మాత్రం రమ్యకృష్ణ కి హ్యాండ్ ఇచ్చి ఆమె ప్లేస్ లో శ్రీయ ని ఫిక్స్ చేశారనే ప్రచారం జరుగుతోంది.అయితే నిజంగానే రమ్యకృష్ణ స్థానంలో శ్రీయను తీసుకున్నారా?లేక మరో పాత్ర కోసం తీసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

ఇక గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుండగా..ఈ సీక్వెల్ లో కూడా కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండేలా స్క్రిప్ట్ ని రెడీ చేసారట దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.ఈ సినిమా షూటింగ్ ని వేగంగా పూర్తి చేసి.. వచ్చే ఏడాది మొదటి భాగంలో ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో సరైనభారీ హిట్ లేని నాగార్జున తన ఆశలన్నీ ఈ సీక్వెల్ పైనే పెట్టుకున్నాడు.ఇక ఈ సీక్వెల్ తో పాటు గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు నాగ్.సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ ఇక రా ఏజెంట్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఆయనతో పాటూ కాజల్ అగర్వాల్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: