రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం నాలుగు సినిమాలు తెరకెక్కుతుండగా వాటిలో రాధాకృష్ణ తీస్తున్న రాధేశ్యాం మూవీ ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అందుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా త్వరలో విడుదలకు ముస్తాబవుతున్నట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ వారు ఎంతో భారీగా నిర్మిస్తున్నారు. ఇక దీనితో పాటు ప్రశాంత్ నీల్ తీస్తున్న సలార్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా హోంబలె ఫిలిమ్స్ వారు తీస్తున్న ఆ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. మరోవైపు ఓం రౌత్ తీస్తున్న ఆదిపురుష్ సినిమా కూడా చేస్తున్న ప్రభాస్, ఇందులో శ్రీరాముడిగా యాక్ట్ చేస్తుండగా కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్ర చేస్తున్న ఈ సినిమాని టి సిరీస్ సంస్థ అధినేత భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇక వీటితో పాటు ఇటీవల నాగ అశ్విన్ తీస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా షూట్ కూడా మొదలెట్టారు ప్రభాస్. దీపికా పదుకొనె కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్ర చేస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా పలు ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం ఇటీవల హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా యాక్ట్ చేసిన వార్ మూవీ దర్శకుడు సిద్దార్ధ ఆనంద్ ఇప్పటికే ప్రభాస్ కోసం ఒక భారీ యాక్షన్ స్టోరీ ని సిద్ధం చేసి ఆయనకు వినిపించారని, అది ఎంతో నచ్చిన ప్రభాస్ పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయండి, త్వరలోనే దానిని పట్టాలెక్కిద్దాం అని మాటిచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం సిద్దార్ధ దాని స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారని, ఈ ఏడాది చివర్లో ఈ సినిమా యొక్క అధికారిక అనౌన్స్ మెంట్ రానున్నట్లు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే ప్రభాస్ నుండి మరొక భారీ మూవీ ఖాయం అనే చెప్పాలి .... !!

మరింత సమాచారం తెలుసుకోండి: