టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్  రోబో 2.0 బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాక.. తర్వాతి ప్రాజెక్ట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎలాగైనా సరే హిట్ కొట్టాలని మంచి స్కెచ్ వేశాడు. అప్పట్లో విజయం సాధించిన భారతీయుడుకు సీక్వెల్ గా 'ఇండియన్2'ను పట్టాలెక్కించేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. లైకా ప్రొడక్షన్స్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని షూటింగ్ స్పాట్ కు తీసుకెళ్లాడు. అయితే అక్కడ శంకర్‌కి, నిర్మాతలకు మధ్య విభేదాలు తలెత్తాయి. బడ్జెట్‌లో కోత పెట్టారని శంకర్‌ కొన్నాళ్లు షూటింగ్‌ కు రాకుండా పోయాడు.   ఆ తర్వాత 'ఇండియన్2' పూర్తయ్యే వరకు శంకర్ మరో సినిమా చేయకూడదని ప్రొడ్యూసర్లు కోర్టుమెట్లెక్కారు.

శంకర్‌ 'ఇండియన్2' గొడవ సమసిపోకుండానే.. దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమాకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. రామ్‌ చరణ్‌తో పాన్‌ ఇండియన్ మూవీ ప్లాన్ చేశాడు. సెప్టెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌కి వెళ్తుందని తెలుస్తోంది. ఇప్పటికే లొకేషన్‌ సెర్చింగ్ కూడా పూర్తయిందనీ..  సాంగ్‌తో సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ స్టార్ట్ చేస్తారని సమాచారం.  

శంకర్ కెరీర్‌లో 'ఇండియన్' సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి సినిమా సీక్వెల్‌ని శంకర్‌ పక్కనపెట్టేసి, రామ్‌ చరణ్‌తో మూవీ అనగానే కోలీవుడ్‌ జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. నిర్మాతలో పంతానికి పోయి శంకర్ 'ఇండియన్2'ని పక్కనపెట్టేశాడా అని అనుకుంటున్నారు. అయితే కోర్టు గొడవ జరుగుతున్నప్పుడే 'ఇండియన్2' షూటింగ్‌ మాగ్జిమమ్‌ పూర్తయిందని, అన్‌లాక్‌లో బ్యాలెన్స్‌ కంప్లీట్ చేస్తానని చెప్పాడు శంకర్. మరి ఈ బ్యాలెన్స్‌ని ఎప్పటికి పూర్తి చేస్తాడో చూడాలి.


శంకర్ కు ఏం చేయాలో పాలుపోలేదు. ఏ సినిమా చేయాలో అర్థం కాక సతమతమవుతున్నాడు. మోస్ట్ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ఇండియన్ 2ను పక్కన పెట్టి.. ఇంకో సినిమాను లైన్ లో పెడదామనుకుంటే.. ఇండియన్ 2 ప్రొడ్యూసర్లు రచ్చకెక్కుతున్నారు. ఇటు దిల్ రాజు నిర్మాణంలో తీసే సినిమాను సక్సెస్ బాట పట్టించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్.




మరింత సమాచారం తెలుసుకోండి: