కోలీవుడ్ స్టార్ ఆర్య హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సార్పట్ట పరంపర' ఈ సినిమా మీద హీరో ఆర్య కంటే దర్శకుడు పా. రంజిత్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈయన చివరగా రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాళి, కాలా రెండు కూడా అపజయాలు కావడమే. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలనే ఉద్దేశంలో ఈ దర్శకుడు ఉన్నాడు. ఈ సినిమాను కరోనా ప్రభావంతో థియేటర్లలో విడుదల చేయడం కుదరకపోవడంతో ఒక ప్రముఖ 'ఓటిటీ' లో విడుదల చేశారు. ఈ సినిమా చూసినవారంతా హీరోపై దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈమధ్య హీరో కార్తీ కూడా సినిమా చాలా బాగుంది అంటూ తెలియజేశాడు. ప్రస్తుతం 'ఓటిటి' లో ప్రసారమవుతున్న సినిమాలలో ఒక మంచి సినిమాగా చాలామంది చెప్పుకుంటున్నారు.


 అయితే తాజాగా ఈ సినిమా హీరోయిన్ అయినా  దుషారా విజయన్‌ తన వ్యక్తిగత జీవితం మరియు 'సార్పట్ట పరంపర' సినిమా గురించి కొన్ని విషయాలను తెలియజేసింది. దుండుగల్ జిల్లా కన్యాకుమారి గ్రామానికి చెందిన నేను సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఫ్యాషన్ డిజైనింగ్ చేసే సమయంలో 'బోదై ఏరి బుద్ధిమారి' అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించాను. ఆ తర్వాత చాలా కాలం పాటు సినిమాలో నటించడానికి చాలా కష్ట పడ్డాను అని, నా ఐదేళ్ల కష్టానికి ఫలితం ఫలితంగా దర్శకుడు రంజిత్ చిత్రంలో అవకాశం వచ్చింది అని, ఆ అవకాశం ఎలా వచ్చిందో కూడా ఈ హీరోయిన్ వివరించింది. ఒకరోజు పా రంజిత్ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. మరుసటి రోజు ఆఫీసుకు రమ్మని వారు చెప్పారు. కానీ అది నేను నమ్మలేదు ఇది ఏదో ఫ్రాంక్ కాల్ అనుకొని లైట్ తీసుకున్నాను. దానితో మరుసటి రోజు మళ్ళీ ఫోన్ వచ్చింది ఆ ఫోన్లో నీకు అంత పొగరా..? పా రంజిత్ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చిన రావా అంటూ ప్రశ్నించారు. వెంటనే వారికి సారీ చెప్పి ఆఫీస్ కి వెళ్ళాను ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యాను. ఇలా సార్పట్ట పరంపర సినిమాతో మీ ముందుకు వచ్చాను. అంటూ ఈ కథానాయక చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: