ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ సిమ్రాన్ ప్రస్తుతం తెలుగు లో తన రీ ఎంట్రీ  చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నో పెద్ద పెద్ద సినిమాల్లో నటించిన ఈమెకు ఇక్కడ సినిమా అవకాశాలు తగ్గే సరికి పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయింది.  ఆ తర్వాత ఆమె రీ ఎంట్రీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుండగా ఆమె కొన్ని తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు తెలుగు లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది.

తెలుగులో ఆమె అబ్బాయి గారి పెళ్లి సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత మా నాన్న కి పెళ్లి, ఆటో డ్రైవర్, సమర సింహారెడ్డి, అన్నయ్య, కలిసుందాం రా, నువ్వు వస్తావని, యువరాజు, గొప్పింటి అల్లుడు,
 మృగరాజు, నరసింహ నాయుడు, ప్రేమతో రా, డాడీ, సీమ సింహం లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సిమ్రాన్ కార్తీ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న సర్దార్ సినిమా లో కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఈ సినిమాలో కార్తీ తల్లి గా ఆమె కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. 

ఈ సినిమాలో నటించడానికి మొదట్లో సిమ్రాన్ ఒప్పుకోలేదు కానీ భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం తో ఈ పాత్ర చేయడానికి ఏమాత్రం ఆలోచించలేదు సిమ్రాన్. మరి ఈ సినిమాలో ఆమె పాత్ర ఎంత వైవిధ్యంగా ఉంటుందో చూడాలి. ఈ సినిమాతో పాటే మరో నాలుగైదు సినిమాల్లో కూడా ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. తెలుగులో ఓ స్టార్ హీరో సినిమాలో ఆమె చేయబోతోందట. 2008 తరువాత తెలుగులో ఇప్పటి వరకు ఏ సినిమా లోనూ చేయలేదు. ఆమె తెలుగులో కృష్ణభగవాన్ సరసన జాన్ అప్పారావు అనే సినిమాలో ఆఖరిగా నటించింది. హిందీలో సైతం ఆమె తన సత్తా చాటుతూ ప్రస్తుతం రాకేటరి సినిమాలో ఆమె కీలక పాత్రను పోషిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: