మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా స్టార్ హీరోలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రీమేక్ సినిమాలలో నటిస్తుండడం విశేషం. ఒకేసారి వీరిద్దరూ రీమేక్ సినిమాలు చేయడమే కాకుండా ఒకే దారిలో కూడా వెళుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంచి మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ ను తెలుగులో చేస్తున్నారు. ఈ సినిమాకు రెడ్డిగారు అనే టైటిల్ ను పెట్టబోతున్నారు. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ను తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి ఇమేజ్ కు తగ్గట్టుగా ఇక్కడి ప్రేక్షకులకు తగ్గట్లుగా వారి అభిరుచికి అనుగుణంగా మార్చి తెరకెక్కిస్తున్నారు.

అంతేకాదు కొన్ని యాక్షన్ సీన్స్ ను పెంచడం, మెగాస్టార్ సరసన ఓ హీరోయిన్ కూడా పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. మరో వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తున్న మలయాళ సినిమా రీమేక్ ఏకే రీమేక్ సినిమా కూడా చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా కథను తెలుగు కి వచ్చేసరికి పూర్తిగా మార్చివేశారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా రచయిత త్రివిక్రమ్ ఈ సినిమాలో చాలా మార్పులు చేశారట. సాగర్ కే చంద్ర కూడా అదే రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట.రానా మరో కథానాయకుడు గా నటిస్తుండగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా భీమ్లా నాయక్ గా దర్శనమిస్తున్నారు. 

ఈ రెండు సినిమాలను గమనిస్తే వారి వారి ఇమేజ్ కు తగ్గట్టుగా సినిమాల రేంజ్ ను మారుస్తున్నారు సదరు దర్శక రచయితలు. మాతృకలో అంశాలను మాత్రమే తీసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా సినిమాలు మార్చి చేస్తున్నారు.ఇలా గతంలో చేసిన సినిమాలు చాలా హిట్ గా నిలిచాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ సినిమా ప్రేక్షకులను బాగా అలరిస్తాయి అంటున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 13 నుంచి రెడ్డి గారు సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. ఈ సినిమాలో రెండవ హీరోగా పృథ్వీరాజ్ నటిస్తాడని అంటున్నారు. మరి ఈ రెండు మలయాళం చిత్రాలు తెలుగులో ఎంత వరకు అలరిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: