దేశంలో కరోనా వైరస్ కారణంగా తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా వాయిదాలు పడుతూనే వస్తున్నాయి. అయితే కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ లతో పాటుగా, పలు చిత్రాల విడుదలు వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే. ఇక తాజాగా సినిమాల షూటింగ్ లు మళ్ళీ పునః ప్రారంభం అవ్వడంతో పాటుగా, పలు చిత్రాలు విడుదల తేదీలను ఖరారు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి చిత్ర యూనిట్.

ఈ తరుణంలోనే పరశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిన విదితమే. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 చిత్రం సైతం ఈ సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటిస్తున్నారు.

ఇక థలపతీ విజయ్ బీస్ట్ చిత్రం సైతం సంక్రాంతి బరిలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు.. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తాజాగా దగ్గుబాటి రానాలు కలిసి నటిస్తున్న సినిమా కూడా సంక్రాంతి కి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా కోసం అభిమానాలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.దీని గురించి అధికారిక ప్రకటన సైతం వెల్లడించారు.

కాగా.. ఈ చిత్రాలు అన్ని సంక్రాంతి బరిలో ఉండగా, మరికొన్ని చిత్రాలు కూడా సంక్రాంతి రేస్ కి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. అయితే బడా సినిమాలు కూడా సంక్రాంతికి మారడంతో ఇటు ప్రేక్షకులు, అభిమానుల సంతోషానికి అవధులు లేవు. ఇక ఆ స్టార్ హీరోల సినిమాకోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ బరిలో ఎవరు నిలుస్తారో వేచి చూడాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: