తెలుగు చిత్ర పరిశ్రమలో నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆమె వెండితెరపై సందడి చేస్తూనే మరోవైపు బుల్లితెరపై ఢీ షోకి జడ్జిగా వ్యవహారిస్తుంది. పూర్ణ హారర్ సినిమాలో నటిస్తూ లేడి ఓరియెంటెడ్ సినిమాలకి ప్రాముఖ్యతను ఇస్తూ నటిస్తుంది.

ఇక పూర్ణ హీరోయిన్ గా లిడ్ రోల్‌ లో నటించిన చిత్రం ‘సుందరి’. అయితే ‘ది అల్టిమేట్ డెసిషన్ ఆఫ్ ఇన్నోసెంట్ లేడీ’ అనేది ట్యాగ్ లైన్ ఉంది. కాగా.. ఈ హీరోయిన్ సెంట్రిక్ మూవీని రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రిజ్వాన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి  ‘నాటకం ఫేమ్ క‌ళ్యాణ్ జీ గోగ‌న దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాని ఆగస్ట్ 13న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత తెలియజేశారు. అంతేకాక..ఈ సినిమాలో రిజ్వాన్, కళ్యాణ్ కి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకొచ్చారు.

అయితే 16 సంవత్సరాల కెరీర్ లో ఇలాంటి పాత్రను ఎప్పుడూ చేయలేదని తెలిపారు. అంతేకాక.. విలేజ్ డీసెంట్, ఇన్నోసెంట్ అమ్మాయి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే ఇందులోని ప్రధానాంశం అన్నారు. అయితే ఆమెకు ఈ క్యారెక్టర్ బాగా నచ్చిందని పూర్ణ చుపుకొచ్చారు. ఇక ప్రస్తుత సమాజంలో చాలా మంది అమ్మాయిల లైఫ్ లో జరుగుతున్న స్టోరీ అనే చెప్పాలి.

అంతేకాక.. అర్జున్ తో యాక్ట్ చేయడం చాలా కంఫర్ట్ గా ఫీలయ్యానని పూర్ణ వెల్లడించారు. ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుందని అన్నారు.  ఇక ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చునన్నారు. అయితే ఈ సినిమాలో రాకేందు మౌళి ఎక్సలెంట్ గా చేశాడు” అని అన్నారు. ఈ సినిమాకి రాకేందు మౌళి పాటలు రాయగా, సురేశ్ బొబ్బిలి సంగీతం అందించినట్లు తెలిపారు. ఈ మూవీ చుసిన వారంతా చివరికి కన్నీళ్లు పెట్టుకుంటారని ఆమె చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: