కన్నడ భామ రష్మిక మందన్న ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరిందని తెలుస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీలో రష్మిక ఛాన్స్ అందుకుందని టాక్. పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాల్లో నటిస్తున్న రష్మిక లేటెస్ట్ గా జాతిరత్నాలు డైరెక్ట్ చేస్తున్న నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుందని అంటున్నారు. పిట్టగోడ సినిమాతో ప్రతిభ చాటి జాతిరత్నాలుతో సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ అనుదీప్ కెవి తన థర్డ్ మూవీ కోలీవుడ్ లో శివ కార్తికేయన్ తో తీస్తున్నాడని టాక్. ఈ సినిమాను ఓ బడా బ్యానర్ నిర్మిస్తుందని తెలుస్తుంది.

డిస్కషన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా ప్లాన్ చేస్తున్నారు. శివ కార్తికేయన్ కు తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు కాకపోతే డైరక్టర్ అనుదీప్ మీద కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ సినిమా తెలుగులో కూడా క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది. అదీగాక హీరోయిన్ గా రష్మిక అయితే ఇక తిరుగు ఉండదని వారి ప్లాన్. రష్మిక ఇప్పుడు టాలీవుడ్ లో వరుస క్రేజీ మూవీస్ చేస్తూ దూసుకెళ్తుంది. అలాంటి హీరోయిన్ తెలుగులో ఉంటే బాగుంటుందని ఆమెని ఫిక్స్ చేస్తున్నారట.

సినిమా కోసం హీరో శివ కార్తికేయన్ కన్నా హీరోయిన్ గా చేస్తున్న రష్మికకే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నరని టాక్. అనుదీప్ కెవి ఈ సినిమాను సెపరేట్ జోనర్ లో రాసుకున్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ సుల్తాన్ తో తమిళ ఆడియెన్స్ కు దగ్గ్రైన రష్మిక మందన్న ఈ బైలింగ్వల్ సినిమాతో మరోసారి అలరించనుంది. తప్పకుండా ఈ సినిమా ఆడియెన్స్ ను అలరిస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమాకు కన్నడ భామ రష్మిక స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. త్వరలోనే అనుదీప్, శివ కార్తికేయన్, రష్మిక మందన్నల సినిమాకు సంబందిచిన అప్డేట్ వస్తుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: